Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేమించి ఒకరు.. బెదిరించి మరొకరు... బాలికపై కామాంధుల అత్యాచారం

victim
, మంగళవారం, 27 జూన్ 2023 (08:35 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఓ బాలిక అత్యాచారానికి గురైంది. ప్రేమించి ఒకరు.. బెదిరించి మరొకర కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డారు. కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఈ దారుణం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కరీంనగర్‌ పట్టణంలోని ఓ కాలనీకి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. అదేకాలనీలో ఉండే ఇంటర్‌ చదివే బాలుడు, ఆమె ప్రేమించుకునేవారు.  సుమారు ఏడాది కిందట ఓ సందర్భంలో వారిద్దరు సన్నిహితంగా ఉన్న వీడియో, ఫొటోలను బాలుడి ఇద్దరు స్నేహితులు రహస్యంగా చిత్రీకరించారు. 
 
వాటిని చూపుతూ.. తల్లిదండ్రులకు చెబుతామని బెదిరించి బాలికను లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇటీవల వారి స్నేహితులైన మరో ముగ్గురు బాలికను లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. మూడు రోజుల కిందట విషయం షీటీమ్‌ దృష్టికి వెళ్లడంతో వారు.. అఘాయిత్యానికి పాల్పడిన వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి వదిలిపెట్టారు. విషయాన్ని రహస్యంగా ఉంచారు.
 
సోమవారం బాలిక తల్లిదండ్రులతో కలిసి నగరంలోని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆమె ప్రేమికుడితో కలిపి ఆరుగురిపై పోక్సో, అత్యాచారం, బెదిరింపుల కేసు నమోదు చేశారు. 
 
కేసు నమోదైన ఆరుగురిలో ఐదుగురు ఇంటర్మీడియట్ చదువుతున్నారని, మరో వ్యక్తి మేజర్‌ అని, అతను పాలిటెక్నిక్‌ ద్వితీయ సంవత్సరం పూర్తిచేశాడని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామని వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో కాంగ్రెస్ తుఫాను - ఈ సారి కప్పు కొట్టడం ఖాయం : బండ్ల గణేశ్