Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకల దొంగలను ఎస్ఎస్ఐ పట్టుకుంటే కత్తులతో నరికి చంపేసారు

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (13:14 IST)
అతడో నిజాయితీగల పోలీస్ ఇన్‌స్పెక్టర్. నేరగాళ్ల గుండెల్లో నిద్రపోతాడు. అలాంటి పోలీసు అధికారిని మేకల దొంగలు అత్యంత దారుణంగా హత్య చేసారు.

 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. తిరుచ్చిలోని తిరువేంబూరు పరిధిలోని నవల్ పట్టు పోలీసు స్టేషనులో ఎస్ఎస్ఐగా 51 ఏళ్ల భూమినాథన్ పనిచేస్తున్నారు. ఆయన తన గస్తీలో భాగంగా చిన్న సూర్యర్ గ్రామ శివార్లలో అర్థరాత్రి వేళ మేకల అరుపులు విన్నాడు. నలుగురు వ్యక్తులు మేకలను దొంగతనం చేసి మోటార్ సైకిళ్లపై పారిపోవడాన్ని గుర్తించాడు. తనతో పాటు గస్తీలో వున్న మరో పోలీసుతో కలిసి వెంబడించారు.

 
కొంతదూరం వెళ్లాక తనతో వచ్చిన పోలీసు అలసిపోయి వెనుదిరిగాడు. కానీ భూమినాథన్ మాత్రం వారిని అదుపులోకి తీసుకున్నాడు. ఆ తర్వాత పోలీసు స్టేషనుకు ఫోన్ చేసి ఎస్సైకి సమాచారం అందించాడు. వెంటనే ఘటనా స్థలానికి రావాలన్నాడు. ఐతే ఈలోపుగా వారిలో ఇద్దరు వెనుదిరిగి కత్తులతో భూమినాథన్ పైన దాడి చేసి హతమార్చారు.

 
ఎస్సై వచ్చేలోపు భూమినాథన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన వెలుగుచూడటంతో పోలీసులంతా ఉలిక్కిపడ్డారు. నిందితుల కోసం వేట ప్రారంభించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. మృతుడి కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments