Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నా యూనివర్శిటీ ప్రాంగణంలోనే విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

ఐవీఆర్
గురువారం, 26 డిశెంబరు 2024 (16:51 IST)
చెన్నైలోని అన్నా యూనివర్శిటీలో దారుణం జరిగింది. యూనివర్శిటీలో చదువుతున్న ఓ విద్యార్థినిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాలు చూస్తే... చెన్నైలోని అన్నా యూనివర్శిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని ఈ నెల 23వ తేదీ రాత్రి తన స్నేహితుడితో కలసి మాట్లాడుతూ వుంది. ఆ సమయంలో అటుగా ఇద్దరు వ్యక్తులు వచ్చారు.
 
వీరిని గమనించి దగ్గరకు వచ్చి విద్యార్థిని స్నేహితుడిపై దాడి చేసి అక్కడి నుంచి తరిమి వేసారు. అనంతరం విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటన అనంతరం ఆమెను అసభ్యంగా ఫోటోలు తీసి, తమపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించి వదిలేసారు.
 
మరుసటిరోజు ఉదయం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యూనివర్శిటీ ప్రాంగణంలోని సీసీ కెమేరాల ద్వారా నిందితులను గుర్తించారు. ఒకడు రోడ్డు పక్కనే బిర్యానీ అమ్ముకునే జ్ఞానశేఖరన్ అని తెలుసుకుని అతడిని అరెస్ట్ చేసారు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments