Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై ఐదుగురు కామాంధుల సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (20:41 IST)
హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. స్థానిక సుల్తాన్ బజార్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ బాలికపై ఆమె ప్రియుడితో పాటు అతని నలుగురు స్నేహితులు పలుమార్లు అత్యాచారం చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 30వ తేదీన సుల్తాన్ బజార్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక అదృశ్యమైంది. దీనిపై ఆ బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ నెల 3వ తేదీన బాలికను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద విచారణ జరుపగా, తన స్నేహితులతో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు చెప్పారు. 
 
ఆ తర్వాత ఐదుగురు కలిసి మేడిపల్లి ప్రాంతంలో తనపై పలుమార్లు అత్యాచారం జరిపారని మైనర్ బాలిక బోరున విలపిస్తూ చెప్పింది. బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments