Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ ఆసుపత్రి అత్యాచారం కేసు: ఆ అక్కాచెల్లెళ్లకి కెమికల్ కలిపిన కల్లు తాగే అలవాటు, అందుకే...

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (18:50 IST)
గాంధీ ఆసుపత్రి అత్యాచారం కేసులో మిస్టరీ ఏమీ లేదని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవం లేదన్నారు. అక్కాచెల్లెళ్లిద్దరికీ కెమికల్ కలిపిన కల్లు తాగే అలవాటు వుందనీ, ఆసుపత్రిలో వున్న కొద్దిరోజులు ఆ కల్లు తాగకపోయేసరికి ఇద్దరూ ఒత్తిడికి లోనైనట్లు వెల్లడించారు. వాళ్లిద్దరూ ఎదుటి వ్యక్తిని గుర్తుపట్టే స్థితిలో కూడా లేరని అన్నారు.
 
ఆ రోజు ఆసుపత్రి ప్రాంగణం నుంచి అక్క బయటకు వెళ్లిపోయిందనీ, ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన ఆమె చెల్లెలు సెక్యూరిటీ గార్డుతో పరిచయం పెంచుకుందన్నారు. పరస్పర అంగీకారంతో ఇద్దరూ భవనంలోని 7వ అంతస్తులో లైంగికంగా కలిసారనీ, ఆ తర్వాత మరోసారి సెల్లార్‌లో కలిసారన్నారు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏమవుతుందోనన్న ఆందోళన కారణంగా ఆమె ఇలా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసు గురించి ఆసుపత్రిలో వున్న 500కి పైగా సీసీ కెమేరాల నుంచి సుమారు 800 గంటల సీసీ ఫుటేజీలను చూసినట్లు సీపీ తెలిపారు.
 
ఈ కేసు చాలా సెన్సిటివ్ కేసు అనీ, ఇలాంటి నేరాల్లో మహిళల గురించి తప్పుగా మాట్లాడకూదన్న నిబంధనలు వున్నాయన్నారు. కోర్టులో కేసును సబ్మిట్ చేస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం