Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ ఆసుపత్రి అత్యాచారం కేసు: ఆ అక్కాచెల్లెళ్లకి కెమికల్ కలిపిన కల్లు తాగే అలవాటు, అందుకే...

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (18:50 IST)
గాంధీ ఆసుపత్రి అత్యాచారం కేసులో మిస్టరీ ఏమీ లేదని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవం లేదన్నారు. అక్కాచెల్లెళ్లిద్దరికీ కెమికల్ కలిపిన కల్లు తాగే అలవాటు వుందనీ, ఆసుపత్రిలో వున్న కొద్దిరోజులు ఆ కల్లు తాగకపోయేసరికి ఇద్దరూ ఒత్తిడికి లోనైనట్లు వెల్లడించారు. వాళ్లిద్దరూ ఎదుటి వ్యక్తిని గుర్తుపట్టే స్థితిలో కూడా లేరని అన్నారు.
 
ఆ రోజు ఆసుపత్రి ప్రాంగణం నుంచి అక్క బయటకు వెళ్లిపోయిందనీ, ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన ఆమె చెల్లెలు సెక్యూరిటీ గార్డుతో పరిచయం పెంచుకుందన్నారు. పరస్పర అంగీకారంతో ఇద్దరూ భవనంలోని 7వ అంతస్తులో లైంగికంగా కలిసారనీ, ఆ తర్వాత మరోసారి సెల్లార్‌లో కలిసారన్నారు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏమవుతుందోనన్న ఆందోళన కారణంగా ఆమె ఇలా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసు గురించి ఆసుపత్రిలో వున్న 500కి పైగా సీసీ కెమేరాల నుంచి సుమారు 800 గంటల సీసీ ఫుటేజీలను చూసినట్లు సీపీ తెలిపారు.
 
ఈ కేసు చాలా సెన్సిటివ్ కేసు అనీ, ఇలాంటి నేరాల్లో మహిళల గురించి తప్పుగా మాట్లాడకూదన్న నిబంధనలు వున్నాయన్నారు. కోర్టులో కేసును సబ్మిట్ చేస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ షూటింగ్

హ్యాట్సాఫ్ కింగ్ నాగార్జున.. నెట్టేసిన ఫ్యాన్‌ను కలిశాడు.. (వీడియో)

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం