Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గాంధీ కేసులో వీడని మిస్టరీ.. పరీక్షల్లో కనిపించని క్లోరోఫాం ఆనవాళ్లు

Advertiesment
Hyderabad
, బుధవారం, 18 ఆగస్టు 2021 (09:38 IST)
హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిలో జరిగిన అక్కా చెల్లెళ్ల అత్యాచారం కేసులోని మిస్టరీ ఇంకా వీడిపోలేదు. ఈ కేసులోని సరైన క్లూ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బాధితులిద్దరికీ జరిపిన పరీక్షల్లో క్లోరోఫాం ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. దీంతో దర్యాప్తు బృందాలు తలలు పట్టుకుంటున్నారు.
 
కాగా, ఇటీవల ఈ గాంధీ ఆసుపత్రిలో తనతో పాటు తన సోదరిపైనా సామూహిక అత్యాచారం జరిగిందంటూ ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఉదంతంపై స్పష్టత సాధించడంతో పాటు ఇప్పటికీ ఆచూకీ లేని మరో బాధితురాలిని కనిపెట్టడం కోసం మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. 
 
అయితే బాధితురాలు చెప్తున్న విషయాల్లో పొంతన లేకపోవడంతో ఇదంతా కల్లు ప్రభావంతో జరిగిన లొల్లిగానూ అనుమానిస్తున్న అధికారులు..ఆ కోణంలోనూ ఆరా తీస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో పని చేయకపోవడం, అదృశ్యమైన మహిళ వద్ద సెల్‌ఫోన్‌ లేకపోవడంతో దర్యాప్తు జఠిలంగా మారింది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిషీల్డ్ టీకా వేయాలని కోర్టుకెక్కిన కేరళ వ్యక్తి: కుదరదన్న కేంద్రం