Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

వరుణ్
మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (15:04 IST)
విజయవాడ నగరంలో దారుణ ఘటన ఒకటి జరిగింది. ఒక కుటుంబానికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు మృతదేహాలుగా కనిపించారు. ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు ఉండగా, ఇంటి బయట మరో వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. ఉరేసుకున్న వ్యక్తి డాక్టర్ కావడం గమనార్హం. కుటుంబ సభ్యులను హత్య చేసి.. ఆపై తాను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 
 
విజయవాడ పట్టణంలో ఆర్థోపెడిక్ నిపుణుడైన డాక్టర్ శ్రీనివాస్ విజయవాడలోని శ్రీజ అనే ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ఆయన తన కుటుంబంతో కిసి గురునానక్ కాలనీలో ఉంటున్నారు. ఈయనకు భార్య ఉష (38), తల్లి రవణమ్మ (65), ఇద్దరు పిల్లలు శైలజ (9), శ్రీహాన్ (8)లు ఉన్నారు. వీరిలో రవణమ్మ, ఉష, శైలజ, శ్రీహాన్‌లు ఇంటిలో రక్తపుమడుగులో విగతజీవుల్లో కనిపించారు. 
 
శ్రీనివాస్ మాత్రం ఇంటి ఆవరణలోని చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం వల్లే ఆయన తన ఆస్పత్రిని లీజుకిచ్చారు. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments