Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

వరుణ్
మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (15:04 IST)
విజయవాడ నగరంలో దారుణ ఘటన ఒకటి జరిగింది. ఒక కుటుంబానికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు మృతదేహాలుగా కనిపించారు. ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు ఉండగా, ఇంటి బయట మరో వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. ఉరేసుకున్న వ్యక్తి డాక్టర్ కావడం గమనార్హం. కుటుంబ సభ్యులను హత్య చేసి.. ఆపై తాను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 
 
విజయవాడ పట్టణంలో ఆర్థోపెడిక్ నిపుణుడైన డాక్టర్ శ్రీనివాస్ విజయవాడలోని శ్రీజ అనే ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ఆయన తన కుటుంబంతో కిసి గురునానక్ కాలనీలో ఉంటున్నారు. ఈయనకు భార్య ఉష (38), తల్లి రవణమ్మ (65), ఇద్దరు పిల్లలు శైలజ (9), శ్రీహాన్ (8)లు ఉన్నారు. వీరిలో రవణమ్మ, ఉష, శైలజ, శ్రీహాన్‌లు ఇంటిలో రక్తపుమడుగులో విగతజీవుల్లో కనిపించారు. 
 
శ్రీనివాస్ మాత్రం ఇంటి ఆవరణలోని చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం వల్లే ఆయన తన ఆస్పత్రిని లీజుకిచ్చారు. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

Nabha : ఎలీ ఇండియా జూలై మేగజైన్ కవర్ పైజీపై నభా నటేష్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments