Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాండ్య జిల్లాలో దారుణం : ఒకే కుటుంబంలో ఐదుగురి దారుణ హత్య

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (10:38 IST)
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. ఈ దారుణం రాష్ట్రంలోని మాండ్య జిల్లా శ్రీరంగ పట్టణ తాలూకా కేఆర్ఎస్ గ్రామంలో జరిగింది. మృతుల్లో 12 యేళ్లలోపు చిన్నారులు నలుగురు ఉండటం ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టిస్తుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామంలోని బజార్ లైనుకు చెందిన లక్ష్మి (30), రాజ్ (12), కూసమల్ (7), కునాల్ (5), గోవింద్ (12)లంతా కలిసి ఒకే ఇంట్లో నిద్రపోతున్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని దుండగులు మారణాయుధాలతో ప్రవేశించి విచక్షణా రహితంగా వారిపై కాల్పులు జరిపి హత్య చేశారు. 
 
ఆ తర్వాత ఇంట్లోని బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును దోచుకుని పారిపోయారు. హత్యకు గురైన లక్ష్మి భర్త గంగారాం ప్లాస్టిక్ వస్తువులు విక్రయించే వ్యాపారం చేస్తున్నారు. ఈయన తన సొంతూరికి వెళ్లిన సమయంలో ఈ దారుణం జరిగింది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యలకు పాల్పడిన దుండగుల ముఠా కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు ఐసీ, ఎస్పీలు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments