Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాండ్య జిల్లాలో దారుణం : ఒకే కుటుంబంలో ఐదుగురి దారుణ హత్య

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (10:38 IST)
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. ఈ దారుణం రాష్ట్రంలోని మాండ్య జిల్లా శ్రీరంగ పట్టణ తాలూకా కేఆర్ఎస్ గ్రామంలో జరిగింది. మృతుల్లో 12 యేళ్లలోపు చిన్నారులు నలుగురు ఉండటం ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టిస్తుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామంలోని బజార్ లైనుకు చెందిన లక్ష్మి (30), రాజ్ (12), కూసమల్ (7), కునాల్ (5), గోవింద్ (12)లంతా కలిసి ఒకే ఇంట్లో నిద్రపోతున్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని దుండగులు మారణాయుధాలతో ప్రవేశించి విచక్షణా రహితంగా వారిపై కాల్పులు జరిపి హత్య చేశారు. 
 
ఆ తర్వాత ఇంట్లోని బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును దోచుకుని పారిపోయారు. హత్యకు గురైన లక్ష్మి భర్త గంగారాం ప్లాస్టిక్ వస్తువులు విక్రయించే వ్యాపారం చేస్తున్నారు. ఈయన తన సొంతూరికి వెళ్లిన సమయంలో ఈ దారుణం జరిగింది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యలకు పాల్పడిన దుండగుల ముఠా కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు ఐసీ, ఎస్పీలు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments