Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాండ్య జిల్లాలో దారుణం : ఒకే కుటుంబంలో ఐదుగురి దారుణ హత్య

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (10:38 IST)
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. ఈ దారుణం రాష్ట్రంలోని మాండ్య జిల్లా శ్రీరంగ పట్టణ తాలూకా కేఆర్ఎస్ గ్రామంలో జరిగింది. మృతుల్లో 12 యేళ్లలోపు చిన్నారులు నలుగురు ఉండటం ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టిస్తుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామంలోని బజార్ లైనుకు చెందిన లక్ష్మి (30), రాజ్ (12), కూసమల్ (7), కునాల్ (5), గోవింద్ (12)లంతా కలిసి ఒకే ఇంట్లో నిద్రపోతున్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని దుండగులు మారణాయుధాలతో ప్రవేశించి విచక్షణా రహితంగా వారిపై కాల్పులు జరిపి హత్య చేశారు. 
 
ఆ తర్వాత ఇంట్లోని బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును దోచుకుని పారిపోయారు. హత్యకు గురైన లక్ష్మి భర్త గంగారాం ప్లాస్టిక్ వస్తువులు విక్రయించే వ్యాపారం చేస్తున్నారు. ఈయన తన సొంతూరికి వెళ్లిన సమయంలో ఈ దారుణం జరిగింది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యలకు పాల్పడిన దుండగుల ముఠా కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు ఐసీ, ఎస్పీలు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments