Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టిందనీ తండ్రి ఆత్మహత్య.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (11:19 IST)
సాధారణంగా ఆడ పిల్లలు పుడితే వారిని చంపేస్తుంటారు. కానీ, ఇక్కడ ఓ విచిత్ర విషాద ఘటన జరిగింది. తన భార్యకు మూడో కాన్పులోనూ ఆడపిల్ల జన్మించడంతో తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగరులో జరిగింది. 
 
దీనిపై అత్తాపూర్ ఔట్‌పోస్ట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కిషన్ జీ స్పందిస్తూ, సులేమాన్ నగరుకు చెందిన మహ్మద్ అహ్మద్ (35) అనే వ్యక్తి స్థానికంగా ఉండో ఓ ఫర్నీచర్ షాపులో పని చేస్తున్నాడు. ఈయనకు భార్య అహ్మద్ ఉన్నారు. వీరికి ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల మూడో కాన్పు కోసం కర్నాటక రాష్ట్రంలోని తన పుట్టింటికి వెళ్లింది. ఆమె తాజాగా మూడో బిడ్డకు జన్మినిచ్చింది. ఈ కాన్పులోనూ ఆమెకు ఆడశిశువే జన్మినించింది.
 
ఈ విషయం తెలుసుకున్న అహ్మద్.. తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. గత కొన్ని రోజులుగా ముభావంగా ఉంటూ కుటుంబ సభ్యులతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments