Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యసనాలకు బానిసైన కన్నబిడ్డను చంపేసిన తండ్రి..

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2023 (16:28 IST)
ఏపీలోని నంద్యాల జిల్లాలోని వెలుగోడు పట్టణంలో ఓ దారుణం జరిగింది. దురలవాట్లకు బానిసైన కన్నబిడ్డను కన్నతండ్రి చంపేశాడు. గొంతుకు కండువా బిగించి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశాడు. ఈ పట్టణంలోని సీపీ నగర్‌కు చెందిన సిరివేరు రామకృష్ణ అనే వ్యక్తికి సిరివేరు శ్రీనివాసులు అనే కుమారుడు ఉన్నాడు. ఇతను చిన్న వయస్సు నుంచే అన్ని రకాల వ్యసనాలకు బానిసయ్యాడు. నిత్యం మద్యం సేవించి వచ్చి తన తండ్రితో గొడవపడసాగాడు. దీంతో కొడుకును పలుమార్లు మందలించి, సరిదిద్దే యత్నం చేశాడు. కానీ, అతనిలో ఎలాంటి మార్పురాలేదు. దీంతో తంర్డి విసిగిపోయాడు. 
 
ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కూడా శ్రీనివాసులు మద్యం సేవించి వచ్చి తండ్రితో గొడవపడ్డాడు. దీంతో విసిగిపోయిన తండ్రి కుమారుడిపై ఉన్న మమకారాన్ని చంపుకుని కండువాతో గొంతు బిగించాడు. దీంతో ఊపిరాడకపోవడంతో శ్రీనివాసులు ప్రాణాలు విడిచాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: స్టేజ్‌పై సమంత- చిరునవ్వుతో చప్పట్లు కొట్టిన అక్కినేని అమల (వీడియో)

మైసూర్ సబ్బుకు ప్రచారకర్తగా తమన్నా అవసరమా? కర్నాటకలో సెగ!!

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments