Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యసనాలకు బానిసైన కన్నబిడ్డను చంపేసిన తండ్రి..

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2023 (16:28 IST)
ఏపీలోని నంద్యాల జిల్లాలోని వెలుగోడు పట్టణంలో ఓ దారుణం జరిగింది. దురలవాట్లకు బానిసైన కన్నబిడ్డను కన్నతండ్రి చంపేశాడు. గొంతుకు కండువా బిగించి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశాడు. ఈ పట్టణంలోని సీపీ నగర్‌కు చెందిన సిరివేరు రామకృష్ణ అనే వ్యక్తికి సిరివేరు శ్రీనివాసులు అనే కుమారుడు ఉన్నాడు. ఇతను చిన్న వయస్సు నుంచే అన్ని రకాల వ్యసనాలకు బానిసయ్యాడు. నిత్యం మద్యం సేవించి వచ్చి తన తండ్రితో గొడవపడసాగాడు. దీంతో కొడుకును పలుమార్లు మందలించి, సరిదిద్దే యత్నం చేశాడు. కానీ, అతనిలో ఎలాంటి మార్పురాలేదు. దీంతో తంర్డి విసిగిపోయాడు. 
 
ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కూడా శ్రీనివాసులు మద్యం సేవించి వచ్చి తండ్రితో గొడవపడ్డాడు. దీంతో విసిగిపోయిన తండ్రి కుమారుడిపై ఉన్న మమకారాన్ని చంపుకుని కండువాతో గొంతు బిగించాడు. దీంతో ఊపిరాడకపోవడంతో శ్రీనివాసులు ప్రాణాలు విడిచాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments