Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నా నేను చనిపోతున్నా.. ఇదే నా చివరి కాల్.. ఇక నేను కలవను...

Webdunia
సోమవారం, 29 మే 2023 (09:37 IST)
అన్నా.. నేను చనిపోతున్నా.. ఇదే నా చివరి కాల్‌.. ఇక నేను కలవను.. క్షమించండంటూ ఓ యువకుడు తన సోదరుడికి ఫోన్‌ చేసి రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడటం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. తూర్పుగోదావరి జిల్లాలో ఈ విషాదకర ఘటన జరిగింది. 
 
పోలీసుల కథనం మేరకు.. కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్‌కు చెందిన కేదరిశెట్టి శివసాయి గణేశ్‌ (22) తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి నుంచి కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్‌కు సుమారు కరోనా మొదటి లాక్‌డౌన్‌ సమయంలో కుటుంబంతో వచ్చాడు.
 
స్థానికంగా మిర్చిబజ్జీ బండి నడిపిస్తున్నాడు. ఇతని సోదరుడు మణికంఠ కూడా మాదాపూర్‌లో అదే వ్యాపారం చేస్తున్నాడు. అంతా కలిసే ఉంటారు. శనివారం మణికంఠ పుట్టినరోజు కావడంతో స్నేహితులతో బయట ఉన్న సమయంలో రాత్రి 10.24 గంటలకు శివసాయి గణేశ్‌ ఫోన్‌ చేసి చనిపోతున్నా.. అని చెప్పగా ఏం జరిగిందని మణికంఠ అంటుండగానే ఫోన్‌ ఆపేశాడు.
 
వెంటనే ఇంటికి చేరుకున్న మణికంఠ విషయం చెప్పి సమీపంలోని హైటెక్‌ సిటీ ఎంఎంటీఎస్‌ రైల్వేస్టేషన్‌ చుట్టుపక్కల వాకబు చేసే క్రమంలో శివసాయిగణేశ్‌ రైలు కింద పడి మృతిచెందివుండటాన్ని గుర్తించాడు. తన పుట్టినరోజునే సోదరుడు విగతజీవిగా మారడం చూసి బోరుమన్నాడు. 
 
ఆర్థిక సమస్యలు తమతో పంచుకోకుండా ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు విలపించారు. శవపరీక్ష అనంతరం రైల్వే పోలీసులు మృతదేహాన్ని అప్పగించడంతో ఆదివారం అంత్యక్రియలు పూర్తిచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments