హస్తినలో దారుణం : మైనర్ బాలుడిపై కబడ్డీ కోచ్ అత్యాచారం

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (14:44 IST)
దేశ రాజధాని న్యూ ఢిల్లీ నేరాలకు ఘోరాలు, అత్యాచారాలకు అడ్డాగా మారిపోయింది. అమ్మాయిలో కాదు మైనర్లు కూడా బాధితులవుతున్నారు. తాజాగా ఓ 15 మైనర్ బాలుడిపై కబడ్డీ కోచ్ అత్యాచారానికి తెగబడిన దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రోహిణి జిల్లా కంఝవాలా ప్రాంతంలోని ఓ కబడ్డీ శిక్షణా కేంద్రంల 15 యేళ్ల బాలుడు కబడ్డీ నేర్చుకునేందుకు చేరాడు. శిక్షణ కోసం ప్రతిరోజూ వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఆ బాలుడు శిక్షణకు వెళ్లడం మానేశాడు. పైగా, తల్లిదండ్రులు ఒత్తిడి చేసినప్పటికీ అక్కడకు వెళ్లేందుకు ససేమిరా అన్నాడు. 
 
ఆ తర్వాత తల్లిదండ్రులు ఆ బాలుడిని దగ్గర కూర్చోబెట్టుకుని నయతారంగా అడగడంతో అసలు విషయం వెల్లడించాడు. కబడ్డీ కోచ్ తనతో నీచమైన పని చేసేవాడని బాధిత బాలుడు బోరున విలపిస్తూ చెచ్పాడు. దీంతో బాధితుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. 
 
తన వద్దకు శిక్షణకు వచ్చే విద్యార్థులతో కోచ్ అసహజ శృంగారానికి పాల్పడేవాడని తేలింది. దీంతో అతనిపై ఐపీసీ 377, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాడు. ఇంత నీచానికి దిగజారిన కోచ్‌ను కఠినంగా శిక్షించాలని బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments