Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపురానికి ఇంటికి రమ్మని పిలవడానికి వెళ్లిన భర్తపై పెట్రోల్ పోసిన నిప్పంటించిన భార్య...

Webdunia
ఆదివారం, 23 జులై 2023 (13:58 IST)
కాపురానికి ఇంటికి రావాలంటూ పిలిచేందుకు వెళ్లిన భర్తపై కట్టుకున్న భార్య తన తల్లిదండ్రులతో కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీలోని ట్రాన్స్ యమున కాలనీలోని తేవారి భాగియా ప్రాంతానికి చెందిన ప్రీతి, ధర్మేంద్ర అనే వారికి గత 2019 నవంబరు 8వ తేదీన వివాహం జరిగింది. ఈ పెళ్లి జరిగినప్పటి నుంచి ప్రీతి పుట్టింటిలోనే ఉంటూ వచ్చింది. పైగా, ప్రీతితో పాటు ఆమె కుటుంబ సభ్యుల ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని బాధితుడి సోదరుడు లోకేశ్ అంటున్నారు. 
 
ఈ క్రమంలో తన భార్యను కాపురానికి ఇంటికి తీసుకొచ్చేందుకు అత్తారింటికి వెళ్లిన ధర్మేంద్రపై భార్య ప్రీతి తన తల్లిదండ్రులతో కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో ధర్మేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆయన్ను ఇరుగుపొరుగువారు ఆస్పత్రికి తరలించగా, ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై బాధితుడి సోదరుడు లోకేశ్ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ప్రీతితో ఆమె కుటుంబ సభ్యులను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments