Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురుగ్రామ్‌లో దారుణం... టెన్త్ విద్యార్థినిపై ఐదుగురి సాముూహిక అత్యాచారం

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (10:11 IST)
హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. పదో తరగతి బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలికను కామాంధులైన ఇద్దరు స్నేహితులు బలవంతంగా బైకుపై ఎక్కించుకుని హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ మరో ముగ్గురు కామాంధులతో కలిసి అత్యాచారనికి పాల్పడ్డారు. ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, శనివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ బాలిక... రాత్రిపొద్దుపోయినా ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకుండా పోయింది. 
 
ఈ క్రమంలో మరుసటి రోజు ఉదయం 10 గంటల సమయంలో ఆ బాలిక ఇంటి సమీపంలో కనిపించింది. ఆ తర్వాత ఆమె వద్ద ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. తన ఇద్దరు స్నేహితులు బైకుపై హోటల్‌కు తీసుకెళ్లారని, అక్కడ మరో ముగ్గురుతో కలిసి అత్యాచారం చేశారంటూ బోరున విలపిస్తూ చెప్పింది. 
 
పైగా, ఈ విషయం బయటకు చెప్పొద్దంటూ, చెబితే చంపేస్తామని హెచ్చరించారని తెలిపారు. దీంతో షాక్‌కు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. మరోముగ్గురి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments