Webdunia - Bharat's app for daily news and videos

Install App

కానిస్టేబుల్ కర్కశం... కన్నతల్లిని కొట్టి చంపేశాడు..

ఠాగూర్
శుక్రవారం, 29 నవంబరు 2024 (10:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ కానిస్టేబుల్ కిరాతక చర్యకు పాల్పడ్డాడు. కన్నతల్లిని కర్కశంగా కొట్టి చంపేశాడు. కుటుంబ తగాదాలను మనసులో పెట్టుకుని ఆ కిరాతక కానిస్టేబుల్.. కన్నతల్లిపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధ తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు నగరంలో చోటుచేసుకుంది. 
 
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. చిత్తూరు నగరంలోని దుర్గానగర్ కాలనీ రోసీ నగర్‌కు చెందిన శంకర్ అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా పనిచేస్తూ, ఇటీవలే సస్పెండ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తాగుడుకు బానిసైన శంకర్... బుధవారం రాత్రి తన తల్లి వసంతము (63)ను మద్యానికి డబ్బులు అడగగా, ఆమె లేదు అనడంతో ఆమెను శంకర్ కాలితో బలంగా తన్నాడు. ఆపై ఆమెను విచక్షణారహితంగా పిడుగుద్దులతో చితకబాదాడు. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వసంతమ్మ అస్వస్థతకు గురికావడంతో బంధువులు చికిత్స నిమిత్తం ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. అనంతరం ఆమె పరిస్థితి విషమించడంతో తన స్వగృహానికి తీసుకురాగా మృతి చెందింది. ఈ ఘటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నెట్టి కంటయ్య వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments