Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను తన వద్దకు రమ్మన్న భర్త.. కత్తితో పొడిచిన ప్రియుడు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2022 (19:28 IST)
చెన్నైలో ఓ దారుణం జరిగింది. ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యను పెద్ద మనస్సుతో కట్టుకున్న భర్త క్షమించాడు. పైగా, భార్యను తన వద్దకు రావాలని ఫోను చేశాడు. ఈ మాటలు ఆమె ప్రియుడికి ఏమాత్రం రుచించలేదు. ఆమెతో వివాహేతర సంబంధాన్ని వదులుకోరాదని భావించిన ప్రియుడు ఆమె భర్తను హత్య చేశాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 33 యేళ్ళ శంకర్ అనే వ్యక్తి పెయింటింగ్ పనులు చేస్తూ చెన్నైలో ఉంటున్నాడు. ఈయనకు తిరునెల్వేలికి చెందిన ఓ మహిళతో వివాహమైంది. పుట్టింటిలోనే ఉంటున్న ఆ మహిళకు స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలిసింది., ఈ నేపథ్యంలో తాను పని చేసే చెన్నైలోనే కలిసివుందామని, అక్కడకు రావాలని ఆమెను ఫోనులో కోరాడు. 
 
ఈ విషయం తెలిసిన ప్రియుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. తన ప్రియురాలు చెన్నైకు వెళితే అక్రమ సంబంధం తెగిపోతుందని భావించి, శంకర్‌ను కలిసేందుకు చెన్నైకు వచ్చాడు. పెయింటింగ్ పనులు చేసే స్థలానికెళ్లి శంకర్‌తో గొడవపడ్డాడు. ఆ తర్వాత తన వద్ద ఉన్న కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments