Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డ్రైవర్, యజమాని, పోలీసు మధ్య ఆసక్తిగా సాగే కథే కొరమీను

Koraminu prerelease
, బుధవారం, 28 డిశెంబరు 2022 (19:07 IST)
Koraminu prerelease
ఆనంద్ రవి కథానాయకుడిగా  ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మిస్తోన్న‌ సినిమా 'కోరమీను'. స్టోరీ ఆఫ్ ఇగోస్ అనేది కాప్షన్. శ్రీపతి కర్రి దర్శకత్వం వహిస్తున్నారు. జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీకి కొత్తగా వచ్చిన పోలీస్ మీసాల రాజు మీసాలు ఎవరు తీసేశారనేది ఆసక్తికరమైన అంశంతో మడిపడిన  మూవీ ఇది. ఓ డ్రైవర్, అహంకారంతో కూడిన, బాగా డబున్న అతని యజమాని, వైజాగ్‌లో శక్తివంతమైన పోలీసు ఈ మూడు క్యారెక్టర్స్ మధ్య నడిచే చిత్రమే ‘కొరమీను’. డిసెంబర్ 31న సినిమా రిలీజ్ అవుతుంది. పాటలు మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయ్యాయి. కొరమీను’ చిత్రాన్ని  గంగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మ‌హేశ్వ‌ర్ రెడ్డి  తెలుగు రాష్ట్రాల్లో డిసెంబ‌ర్ 31న  గ్రాండ్‌గా రిలీజ్  చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం కొర‌మీను టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది.
 
ప‌రిమిత‌మైన బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న సినిమాల‌కు సంబంధిచి కొర‌మీను, ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ సినిమా టీమ్స్ క‌లిసి ఓ కొత్త ఒర‌వ‌డిని తీసుకొచ్చారు. ఒక‌రోజు ముందుగా వ‌స్తున్న ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ టీమ్ మంగ‌ళ‌వారం రాత్రి జ‌రిగిన త‌మ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కొర‌మీను టీమ్‌ను ఆహ్వానించగా హీరో ఆనంద్ ర‌వి, హీరోయిన్ కిశోరి వెళ్లి టీమ్‌కు విషెష్ తెలియ‌జేశారు. అలాగే బుధ‌వారం జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ టీమ్‌ని కొర‌మీను టీమ్ ఆహ్వానించగా.. సోహైల్‌, హీరోయిన్ మోక్ష హాజ‌రై త‌మ విషెష్‌ను అందించారు. ఇలా ఒక‌రికొక‌రు స‌పోర్ట్ అందించుకుంటూ ముందుకు సాగే స‌రికొత్త ట్రెండ్‌కి ఈ రెండు సినిమా యూనిట్స్ ఆహ్వానం ప‌లికాయి. దీన్ని ఇలాగే అంద‌రూ కొన‌సాగిస్తే బావుంటుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అనుకుంటున్నాయి. 
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత సమన్య రెడ్డి మాట్లాడుతూ.. 'సినిమా బాగా వచ్చింది. మా చిత్రం డిసెంబర్ 31న రాబోతోంది. మీడియా పిలిస్తే జనాలు కచ్చితంగా థియేటర్‌కు వస్తారు. లక్కీ లక్ష్మణ్ కథ వేరేగా ఉంటుందని, ఆ లక్ మాకు కూడా రావాలని, కొరమీను కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
 
డైరెక్టర్ శ్రీపతి మాట్లాడుతూ.. 'డిసెంబర్ 31న మా చిత్రం రిలీజ్ కాబోతోంది. అందరూ చూడండి. మా సినిమా గురించి టీం అంతా మాట్లాడింది. ఒక డైరెక్టర్‌లా కాకుండా.. నేను ఓ ప్రేక్షకుడిలా చెబుతున్నా. రోలర్ కోస్టర్ రైడ్‌లా ఉంటుంది. థియేటర్‌ నుంచి బయటకు వచ్చే సమయంలో కచ్చితంగా ప్రేక్షకులే సినిమాను ప్రమోట్ చేస్తారు' అని అన్నారు.
 
ఆనంద్ రవి మాట్లాడుతూ.. 'ఇక్కడకు వచ్చి ప్రమోట్ చేసిన లక్కీ లక్ష్మణ్ టీంకు థాంక్స్. డిసెంబర్ 30న లక్కీ లక్ష్మణ్ వస్తోంది. డిసెంబర్ 31న మా కొరమీను రాబోతోంది. మందుబాబుల దినోత్సవం నాడు మా సినిమా రాబోతోంది. సినిమాను చూసిన ఏ ఒక్కరూ నిరాశచెందరు. ఇంతకు మించి నేనేమీ ఇప్పుడు చెప్పను. ఆ తరువాత మాట్లాడుకుందాం' అని అన్నారు.
 
హీరోయిన్ కిషోరి మాట్లాడుతూ.. 'కొరమీనులో మీనాక్షి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇలాంటి పాత్రను నాకు ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్. నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చిన పెద్ద బాధ్యతను నాపై పెట్టారు. నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను. నిర్మాత సమన్య గారికి థాంక్స్. ఇంత మంచి పాత్రను రాసిన రవి గారికి థాంక్స్' అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగ చైతన్య కస్టడీ మేలో రాబోతుంది