Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాపిలల్లకు విషం తాగించి... ఉరేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (10:38 IST)
అతనికి ఎంత కష్టం వచ్చిందో ఏమో తెలియదు.. భార్యాపిల్లలకు విషం తాగించి, తాను కూడా ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దారుణం నిజామాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఆదిలాబాద్‌కు చెందిన కొత్తకోట సూర్యప్రకాష్‌ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈయనకు భార్య అక్షయ, కుమార్తె ప్రత్యూష (13), కుమారుడు అద్వైత్ (7)లు ఉన్నాడు. 
 
సూర్యప్రకాష్ కొంతకాలంగా హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో తన భార్యాపిల్లలతో కలిసి నిజామాబాద్‌కు వచ్చి గత 15 రోజులుగా కపిల హోటల్ రూం నంబరు 101లో ఉంటున్నాడు. 
 
అయితే, ఆదివారం ఎంతసేపటికి వారు తలుపులు తీయకపోవడంతో హోటల్ సిబ్బంది కిటికీల్లోని చూడగా, నలుగురు విగతజీవులుగా కనిపించారు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. సూర్య ప్రకాష్ ముందుగా భార్యాపిల్లకు విషమిచ్చి వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత ఉరేసుకున్నట్టు గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు రావడంతో ఈ పనికి పాల్పడ్డాడా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments