Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికకు మద్యం తాగించి ఇద్దరు యువకుల అత్యాచారం.. ఎక్కడ?

ఠాగూర్
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (10:47 IST)
పల్నాడు జిల్లా నరసరావుపేటలో దారుణం జరిగింది. ఓ బాలికకు మద్యం తాగించిన ఇద్దరు యువకులు ఆమె మత్తులోకి జారుకోగానే అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నరసరావు పేట పట్టణ పరధిలో ఓ బాలిక ఎనిమిదో తరగతి చదువుతుంది. ఈ బాలికతో కోటప్పకొండకు చెందిన 17 యేళ్ళ బాలుడికి సంబంధం ఉంది. ఈ క్రమంలో ఓ డ్యాన్స్ పార్టీలో పని చేసే బాలుడు తాను చెడు వ్యసనాలకు అలవాటు పడటమే కాకుండా, ఆ బాలికకు కూడా అలవాటు చేశాడు. 
 
ఇదిలావుంటే బస్తాల దుకాణంలో పని చేసే తన స్నేహితుడైన మరో యువకుడు (21).. బాలిక స్నేహితురాలైన ఆరో తరగతి చదివే బాలికపై కన్నేశాడు. ఈ క్రమంలో ఇద్దరు బాలికలను బుధవారం రాత్రి కోటప్పకొండ రోడ్డులోని తమ గుడికి పిలిపించుకున్నారు. శీతల పానీయంలో మద్యం కలిపి వారితో తాగించారు. దీంతో వారిద్దరూ బాలికలిద్దరూ మద్యమత్తులోకి జారుకున్నారు. ఆపై ఎనిమిదేళ్ల బాలికపై బాలుడు, యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. 
 
ఆటలాడుకునేందుకు వెళుతున్నామని చెప్పిన కుమార్తెలు రాత్రికి కూడా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఒకటో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అనుమానిత యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాన్ని వెల్లడించారు. అక్కడే ఓ గదిలో వీరు నిర్బంధించిన బాలికలను గుర్తించారు. బాలికలతో పాటు సంబంధిత యువకులను కూడా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాలికలకు కౌన్సెంగ్ ఇచ్చారు. అయితే, ఈ సంఘటనపై తల్లిదండ్రులు ఫిర్యాదు వెనుకాడినట్టు తెలిసింది. వివరణ కోరేందుకు ప్రయత్నించగా పోలీసు అధికారులు స్పందించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments