Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రైవేటుకి వెళ్తున్న బాలికను లాక్కెళ్లి ఐదుగురు సామూహిక అత్యాచారం

Rape

ఐవీఆర్

, శనివారం, 3 ఫిబ్రవరి 2024 (11:32 IST)
సాయంత్రం పూట ప్రైవేటుకు వెళ్తున్న మైనర్ బాలికపై ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం బీహార్ రాష్ట్రంలోని గయాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. బాలిక సాయంత్రం వేళ ట్యూషన్ చెప్పించుకునేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆమెను దారిలో అడ్డగించారు. ఆ తర్వాత ఆమెను నిర్జన ప్రదేశానికి లాక్కెళ్లి ముగ్గురు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
ఇంతలో అక్కడికి మరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిని చూసి అఘాయిత్యం చేసిన ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన ఆ ఇద్దరు కూడా బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ తర్వాత వారు కూడా అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలు ఎలాగో అక్కడి నుంచి ఇంటికి చేరుకుని తనపై జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకి వివరించింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపుచర్యలు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దురదృష్టవశాత్తు జగన్ ను అన్నా అని పిలవాల్సి వుంది.. సునీత