Webdunia - Bharat's app for daily news and videos

Install App

పజ్జీ గేమ్‌‍లో ఓడిపోయాడని బాలుడు ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 12 జూన్ 2022 (19:05 IST)
ఏపీలోని కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పబ్జీ గేములో ఓడిపోవడాన్ని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో మృతుని కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో జరిగింది. పబ్జీ గేమ్‌లో ఓడిపోయాడంటూ స్నేహితులు హేళన చేయడంతో.. దాన్ని జీర్ణించుకోలేక ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని హౌసింగ్ బోర్డుకు చెందిన ఊటుకూరు ప్రభు అనే 16 సంవత్సరాల బాలుడికి ఫోన్​లో పబ్జీ గేమ్ ఆడుతూ వచ్చాడు. అయితే, ఈ గేమ్​లో ప్రభు ఓడిపోయాడు. దీంతో ఓడిపోయాడని తోటి స్నేహితులు అపహాస్యం చేశారు. స్నేహితుల మాటలతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ బాలుడు తన ఇంట్లోనే ఫ్యాన్​కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఊహించని కుమారుడి చర్యతో ఆ కుటుంబం అంతులేని విషాదంలో మునిగిపోయింది. ఆనందం పంచాల్సిన ఆట.. ఆ కుటుంబంలో విషం చిమ్మడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఏ ఇంటా రావొద్దని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments