Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో దారుణం - కదులుతున్న బస్సులో బాలికపై అత్యాచారం

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (08:57 IST)
బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కదులుతున్న బస్సులో కొందరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తు మందు కలిపిన శీతల పానీయం ఇచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆపై ఆ బాలికను బస్సులోనే వదిలి డోర్ లాక్ చేసి వెళ్ళిపోయాడు. ఈ కేసులో డ్రైవర్, కండక్టర్, క్లీనర్‌తో పాటు మొత్త నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 
 
పోలీసులు కథనం మేరకు.. ఈస్ట్ చంపారన్ జిల్లాలోని మోతిహరి బస్టాండ్‌లో ఈ నెల 17వ తేదీన బాలిక బెట్టయ్య ప్రాంతానికి వెళ్లే బస్సు కోసం ఎదురుచూస్తుంది. ఆ సమయంలో అక్కడకు వచ్చిన బస్సు డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాలని అడగ్గా బెట్టయ్యకు వెళ్లాలని ఆ బాలిక చెప్పింది. 
 
తమ బస్సు అటే వెళుతుందని చెప్పడంతో డ్రైవర్ మాటలు నమ్మిన బాలిక బస్సు ఎక్కింది. కొంతదూరం వెళ్లిన తర్వాత మత్తు మందు కలిపిన శీతలపానీయం ఆ బాలికకు ఇచ్చారు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి జారుకోవడంతో అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
తమ పని పూర్తయిన తర్వాత బస్సును రోడ్డు పక్కన ఆపి డోర్లు లాక్ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ బాలికకు స్పృహలోకి వచ్చి అటుగా వెళుతున్న వారి సాయంతో బయటపడింది.
 
బాధిత బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments