Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులకు షాక్ - సెస్ పేరుతో చార్జీలు పెంచిన టీఎస్ఆర్టీసీ

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (08:19 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మరోమారు ప్రయాణికులపై భారం మోపింది. డీజల్ సెస్ పేరుతో భారీగానా వడ్డించింది. అయితే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం ఈ పెంపును మినహాయించింది. మిగిలిన అన్ని రూట్లలో పెంచేసింది. ఈ పెంపు భారం గురువారం నుంచే అమల్లోకి తెచ్చింది. 
 
ఈ పెంపుతో గత యేడాది కాలంలో ఇప్పటివరకు సగటున రూ.20 మేరకు భారం పడినట్టు అంచనా వేస్తున్నారు. పెరిగిన చార్జీలు గురువారం నుంచి అమల్లోకి రావడంతో ముందుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు అదనపు చార్జీలను చెల్లించాల్సివుంటుంది. డీజల్ ధరల పెరుగుదలతో ఆర్టీసీపై భారం పడటమే ఈ అదనపు సెస్సుకు కారణమని ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంది. 
 
చార్జీల భారం ఇలా... 
 
తాజాగా విధించిన సెస్సుతో కిలోమీటర్లు పెరిగే కొద్దీ చార్జీలు పెరుగుతాయి. దూర ప్రాంతాలకు వెళ్లే వారిపై అధికభారం పడుతుంది. కనీస సెస్సును పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస బస్సులో రూ.5 చొప్పున, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులో రూ.10 చొప్పున పెంచేసింది. 
 
* పల్లె వెలుగు సర్వీసుల్లో 250 కిలోమీటర్లకు కనిష్టంగా రూ.5 గరిష్టంగా రూ.45 వరకు పెరిగింది. 
 
* ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 500 కిలోమీటర్ల దూరానికి కనిష్టంగా రూ.5 నుంచి గరిష్టంగా 90 పెరిగింది. 
 
* సూపర్ లగ్జరీ బస్సులో 500 కిలోమీటర్ల దూరానికి కనిష్టంగా రూ.10, గరిష్టంగా 130 చొప్పున పెంచేశారు. ఏసీ బస్సు సర్వీసుల్లో 500 కిమీ వరకు రూ.10 నుంచి రూ.170 వరకు పెంచింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments