Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమికుడిని నమ్మింది.. పెళ్లి ప్రతిపాదనలో గొడవ.. అంతే ప్రియుడే హత్య చేశాడు..

సెల్వి
బుధవారం, 18 జూన్ 2025 (19:58 IST)
ప్రేమికుడిని నమ్మింది. అతనిని వివాహం చేసుకోవాలనుకుంది. కానీ ఆ యువతిని ప్రేమికుడే హత్య చేసిన ఘటన గోవాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని ఉత్తర బెంగళూరుకు చెందిన సంజయ్ కెవిన్ ఎం (22), అదే ప్రాంతానికి చెందిన రోష్ని మోసెస్ ఎం (22) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
 
పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో వీరిద్దరూ ఇటీవల బెంగళూరు నుంచి గోవాకు వెళ్లారు. అయితే, అక్కడ వారి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, సంజయ్, రోష్నిని హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని గోవాలోని ప్రతాప్ నగర్ అటవీ ప్రాంతాల్లో పడేసి పారిపోయాడు. 
 
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలంలో రోష్నీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆపై కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. విచారణలో ఆమె ప్రేమికుడు సంజయ్ నిందితుడని గుర్తించారు.
 
హత్య వెలుగుచూసిన 24 గంటల్లోపే సంజయ్ ఆచూకీని బెంగళూరులో కనిపెట్టి అరెస్టు చేశారు.  ప్రేమ సంబంధం, పెళ్లి ప్రతిపాదనతో వచ్చిన గొడవ కారణంగా ఈ హత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments