Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంక్ మేనేజర్ కాల్చివేత: జమ్మూకాశ్మీరులో వణుకుతున్న గవర్నమెంట్ ఉద్యోగులు

Webdunia
గురువారం, 2 జూన్ 2022 (13:56 IST)
జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో గురువారం ఉదయం జరిగిన మరో దాడిలో బ్యాంక్ మేనేజర్ కాల్చి చంపబడ్డారని అధికారిక వర్గాలు తెలిపాయి. కుల్గామ్‌ లోని అరేహ్‌లో ఎల్లకై దేహతి బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారని వారు తెలిపారు.

 
"దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించబడ్డాడు, అక్కడ వైద్యులు అప్పటికే అతను చనిపోయినట్లు ప్రకటించారు" అని అధికారిక వర్గాలు తెలిపాయి. హనుమాన్‌గఢ్ రాజస్థాన్‌కు చెందిన కుమార్, ఒక వారం క్రితమే ఆ ప్రాంతంలో నియమించబడ్డాడు. ఈ ఉగ్రదాడి ఘటనలో బ్యాంకు మేనేజర్‌కు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

 
దాడి జరిగిన వెంటనే, దాడి చేసిన వారి జాడ కోసం భారీ వేట ప్రారంభించారు. సాంబ జమ్మూకి చెందిన రజనీ బాలా అనే 36 ఏళ్ల పాఠశాల ఉపాధ్యాయిని అదే జిల్లాలో కాల్చి చంపిన రెండు రోజుల తర్వాత తాజాగా ఈ హత్య జరిగింది. మే నెల నుంచి కశ్మీర్‌లో మైనారిటీలపై లక్షిత దాడులు జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments