Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవితంపై విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకున్న యువతి.. నా చావుకు ఎవరూ కారణం కాదు..

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2023 (13:05 IST)
జీవితంపై విరక్తి చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పైగా, తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ లేఖ రాసిపెట్టి బలవన్మరణానికి పాల్పడింది. లాడ్జీలో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన విశాఖపట్టణం జిల్లాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ జిల్లా వందనపల్లి గ్రామానికి చెందిన రమేష్ కృష్ణ (25) అనే యువతి విశాఖలోని డాబాగార్డెన్స్‌ భానువీధిలో ఉన్న వాస్తు ఇన్‌ లాడ్జికి ఈ నెల 23వ తేదీన వచ్చి, మధ్యాహ్నం 12 గంటలకు ఓ గదిని అద్దెకు తీసుకుంది. 24వ తేదీ రాత్రి వరకు ఆమె గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానించిన లాడ్జి సిబ్బంది... తలుపులు కొట్టారు. అయితే, ఆమె ఎంతకీ తలుపులు తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
 
వెంటనే అక్కడకు చేరుకున్న రెండో పట్టణ పోలీసులు గది తలుపులు తీయగా ఆమె ఫ్యాను హుక్కుకు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. ఘటన స్థలంలో ఆత్మహత్య లేఖను పోలీసులు గుర్తించారు. అందులో తనకు జీవితంపై విరక్తి కలిగిందని, తన చావుకు ఎవరూ కారణం కాదని రాసి ఉంది. ఆమె చైనాలో ఎంబీబీఎస్‌ చదవడానికి వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె విశాఖ ఎందుకు వచ్చింది.. ఇక్కడ ఉరేసుకోవడానికి కారణాలపై విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments