Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవితంపై విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకున్న యువతి.. నా చావుకు ఎవరూ కారణం కాదు..

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2023 (13:05 IST)
జీవితంపై విరక్తి చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పైగా, తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ లేఖ రాసిపెట్టి బలవన్మరణానికి పాల్పడింది. లాడ్జీలో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన విశాఖపట్టణం జిల్లాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ జిల్లా వందనపల్లి గ్రామానికి చెందిన రమేష్ కృష్ణ (25) అనే యువతి విశాఖలోని డాబాగార్డెన్స్‌ భానువీధిలో ఉన్న వాస్తు ఇన్‌ లాడ్జికి ఈ నెల 23వ తేదీన వచ్చి, మధ్యాహ్నం 12 గంటలకు ఓ గదిని అద్దెకు తీసుకుంది. 24వ తేదీ రాత్రి వరకు ఆమె గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానించిన లాడ్జి సిబ్బంది... తలుపులు కొట్టారు. అయితే, ఆమె ఎంతకీ తలుపులు తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
 
వెంటనే అక్కడకు చేరుకున్న రెండో పట్టణ పోలీసులు గది తలుపులు తీయగా ఆమె ఫ్యాను హుక్కుకు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. ఘటన స్థలంలో ఆత్మహత్య లేఖను పోలీసులు గుర్తించారు. అందులో తనకు జీవితంపై విరక్తి కలిగిందని, తన చావుకు ఎవరూ కారణం కాదని రాసి ఉంది. ఆమె చైనాలో ఎంబీబీఎస్‌ చదవడానికి వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె విశాఖ ఎందుకు వచ్చింది.. ఇక్కడ ఉరేసుకోవడానికి కారణాలపై విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments