కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందా? డిప్యూటీ తాహసీల్దార్ కుటుంబంలో కలకలం

ఠాగూర్
శుక్రవారం, 28 నవంబరు 2025 (10:11 IST)
జిల్లా కేంద్రమైన అనంతపురంలో విషాదరక ఘటన ఒకటి వెలుగు చూసింది. డిప్యూటీ తాహసీల్దారు భార్య, కుమారుడు అనుమానాస్పదంగా కనిపించారు. కుటుంబ కలహాల కారణంగా తన కొడుకుని చంపి తల్లి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని రామగిరి డిప్యూటీ తాహసీల్దారుగా రవి పని చేస్తుండగా, ఆయన భార్య, కుమారుడు అనుమానాస్పదస్థితిలో కనిపించారు. అనంతపురంలోని శారదా నగర్‌లో కుటుంబంతో ఉంటున్నారు. ఐదేళ్ల క్రితం అమూల్య అనే మహిళతో ఆయనకు వివాహం కాగా, వీరికి మూడున్నరేళ్ల కుమారుడు సహర్ష ఉన్నాడు. గురువారం విధులకు వెళ్లిన రవి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి తలపు తట్టగా ఎంతసేపటికీ తీయలేదు. 
 
దీంతో అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా, లోపల అమూల్య ఉరికి వేలాడుతూ కనిపించింది. మంచంపై కుమారుడు రక్తపు మడుగులో పడివున్నాడు. ఈ దృశ్యం చూసి షాక్‌కు గురైన రవి.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలు అమూల్య తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇది ఆత్మహత్యనా లేక హత్యనా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments