Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ ఫెయిలయ్యానని మనస్తాపంతో కళాశాల భవనంపై నుంచి దూకేసిన విద్యార్థి

Webdunia
బుధవారం, 22 జూన్ 2022 (18:52 IST)
పరీక్షా ఫలితాలు వస్తే చాలు, ఫెయిల్ అయిన కొందరు విద్యార్థులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. మరికొందరు తను ఫెయిలయ్యాననే బాధతో ఆత్మహత్యా యత్నాలకు పాల్పడుతున్నారు. ఈ రోజు ఇంటర్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో ఫెయిలయ్యానన్న మనస్తాపంతో ఓ విద్యార్థి కళాశాల భవనం పైనుంచి దూకేసాడు.

 
కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన ఇంటర్ విద్యార్థి పరీక్షల్లో ఫెయిలయ్యాననే బాధతో కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకేసాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 
పరీక్షల్లో ఫెయిలైనవాళ్లు జీవితంలో ఎందుకు పనికిరామని అనుకోకూడదనేందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. ఎంతోమంది ధనవంతులు పరీక్షల్లో ఫెయిల్ అయినా ఆ తర్వాత రాణించారు. కనుక పాస్ కాలేదన్న బాధతో ప్రాణాలు తీసుకోవడం సరికాదని చెపుతున్నారు మానసిక నిపుణులు.

 
ఈరోజు విడుదలైన ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 61 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. దీనితో 39 శాతం మంది ఫెయిలయ్యారు. మూల్యంకన విధానం చాలా కఠినంగా వుండటం వల్లే ఇలా జరిగిందని కొందరంటుంటే... కరోనా నేపధ్యంలో ఆల్ పాస్ చేస్తారన్న ధీమాతో చాలామంది విద్యార్థులు పుస్తకాల జోలికే వెళ్లలేదనే వాదన కూడా వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments