ఇంటర్ ఫెయిలయ్యానని మనస్తాపంతో కళాశాల భవనంపై నుంచి దూకేసిన విద్యార్థి

Webdunia
బుధవారం, 22 జూన్ 2022 (18:52 IST)
పరీక్షా ఫలితాలు వస్తే చాలు, ఫెయిల్ అయిన కొందరు విద్యార్థులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. మరికొందరు తను ఫెయిలయ్యాననే బాధతో ఆత్మహత్యా యత్నాలకు పాల్పడుతున్నారు. ఈ రోజు ఇంటర్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో ఫెయిలయ్యానన్న మనస్తాపంతో ఓ విద్యార్థి కళాశాల భవనం పైనుంచి దూకేసాడు.

 
కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన ఇంటర్ విద్యార్థి పరీక్షల్లో ఫెయిలయ్యాననే బాధతో కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకేసాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 
పరీక్షల్లో ఫెయిలైనవాళ్లు జీవితంలో ఎందుకు పనికిరామని అనుకోకూడదనేందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. ఎంతోమంది ధనవంతులు పరీక్షల్లో ఫెయిల్ అయినా ఆ తర్వాత రాణించారు. కనుక పాస్ కాలేదన్న బాధతో ప్రాణాలు తీసుకోవడం సరికాదని చెపుతున్నారు మానసిక నిపుణులు.

 
ఈరోజు విడుదలైన ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 61 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. దీనితో 39 శాతం మంది ఫెయిలయ్యారు. మూల్యంకన విధానం చాలా కఠినంగా వుండటం వల్లే ఇలా జరిగిందని కొందరంటుంటే... కరోనా నేపధ్యంలో ఆల్ పాస్ చేస్తారన్న ధీమాతో చాలామంది విద్యార్థులు పుస్తకాల జోలికే వెళ్లలేదనే వాదన కూడా వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

హీరో కార్తి చిత్రం వా వాత్తియార్‌ రిలీజ్‌కు చిక్కులు - మద్రాస్ హైకోర్టు బ్రేక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments