Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ ఫెయిలయ్యానని మనస్తాపంతో కళాశాల భవనంపై నుంచి దూకేసిన విద్యార్థి

Webdunia
బుధవారం, 22 జూన్ 2022 (18:52 IST)
పరీక్షా ఫలితాలు వస్తే చాలు, ఫెయిల్ అయిన కొందరు విద్యార్థులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. మరికొందరు తను ఫెయిలయ్యాననే బాధతో ఆత్మహత్యా యత్నాలకు పాల్పడుతున్నారు. ఈ రోజు ఇంటర్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో ఫెయిలయ్యానన్న మనస్తాపంతో ఓ విద్యార్థి కళాశాల భవనం పైనుంచి దూకేసాడు.

 
కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన ఇంటర్ విద్యార్థి పరీక్షల్లో ఫెయిలయ్యాననే బాధతో కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకేసాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 
పరీక్షల్లో ఫెయిలైనవాళ్లు జీవితంలో ఎందుకు పనికిరామని అనుకోకూడదనేందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. ఎంతోమంది ధనవంతులు పరీక్షల్లో ఫెయిల్ అయినా ఆ తర్వాత రాణించారు. కనుక పాస్ కాలేదన్న బాధతో ప్రాణాలు తీసుకోవడం సరికాదని చెపుతున్నారు మానసిక నిపుణులు.

 
ఈరోజు విడుదలైన ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 61 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. దీనితో 39 శాతం మంది ఫెయిలయ్యారు. మూల్యంకన విధానం చాలా కఠినంగా వుండటం వల్లే ఇలా జరిగిందని కొందరంటుంటే... కరోనా నేపధ్యంలో ఆల్ పాస్ చేస్తారన్న ధీమాతో చాలామంది విద్యార్థులు పుస్తకాల జోలికే వెళ్లలేదనే వాదన కూడా వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments