గొడవపడి అర్థరాత్రి ఇంటి నుంచి వచ్చిన వివాహిత... బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 5 మే 2023 (09:36 IST)
తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఓ వివాహిత సామూహిక అత్యాచారానికి గురైంది. కుటుంబ సభ్యులతో గొడవపడి అలిగి ఇంటి నుంచి అర్థరాత్రి సమయంలో బయటకు వచ్చింది. రోడ్డుపై ఒంటరిగా నిలబడివున్న ఆ వివాహితను ఓ ఆటో డ్రైవర్ బలవంతంగా లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అతనితో పాటు మరో ఇద్దరు మృగాళ్లు కలిసి ఈ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వరంగల్ జిల్లా హన్మకొండలో వెలుగులోకి వచ్చింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. హన్మకొండ కిషన్‌పురకు చెందిన ఓ వివాహిత ఇంట్లో గొడవపడి గత నెల 27వ తేదీ అర్థరాత్రి సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. హన్మకొండ నయీం నగర్‌లో రంగ్ బార్ రోడ్డుపై నిలబడివుండగా, ఆ సమయంలో కేయూసీ వైపు వెళుతున్న భీమవరానికి చెందిన ఆటో డ్రైవర్ రాకేశ్.. అర్థరాత్రి రోడ్డు ఒంటరిగా నిల్చొనివున్న వివాహితను చూశాడు. ఆ తర్వాత ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకున్నాడు.
 
ఒకవైపు ఆటోను డ్రైవింగ్ చేస్తూనే మరోవైపు భీమవరానికి చెందిన తన స్నేహితులు సతీష్, సనత్‌లకు ఫోనులో సమాచారం ఇవ్వడంతో వారు కూడా కేయూసీ క్రాస్ రోడ్డుకు చేరుకున్నారు. వారిని ఆటోలో ఎక్కించుకుని శివారు ప్రాంతంలోని చెరువు వద్దకు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి, అక్కడ ముగ్గురు కలిసి సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత బాధితురాలిని తీసుకొచ్చి మెయిన్ రోడ్డులో వదిలేసి వెళ్లిపోయారు. దీనిపై బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. బాధితురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments