Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటరిగా నిద్రిస్తున్న బాలిక, మంచంపై దుప్పట్లో దూరిన కామాంధుడు..

Webdunia
ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (12:53 IST)
ఆ బాలికకు 8 యేళ్ళ వయస్సు. బయట మంచంపై పడుకుని నిద్రిస్తుంది. తల్లిదండ్రులు మాత్రం ఇంటి లోపల నిద్రిస్తున్నారు. ఇంటి పక్కన వారు అందరూ బయటే పడుకుని ఉండడంతో తల్లిదండ్రులు కూడా తన కుమార్తె బయట పడుకున్నా భద్రంగానే ఉంటుందనుకున్నారు. అయితే అదే వాళ్ళు చేసిన తప్పుగా తరువాత తెలుసుకున్నారు.

 
చిత్తూరు రోసినగర్‌కు చెందిన బాలిక నిన్న రాత్రి ఒంటరిగా ఇంటి బయట నిద్రపోతోంది. సరిగ్గా రాత్రి 1 గంట సమయంలో అదే ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల నాగరాజు అనే వ్యక్తి మెల్లగా మంచం ఎక్కాడు. అరగంట పాటు మంచం మీదే చడీచప్పుడు చేయకుండా పడుకున్నాడు.

 
ఆ తరువాత మెల్లగా ఆ బాలికపై చెయ్యేశాడు. గాఢ నిద్రలో ఉన్న బాలిక గుర్తించలేకుండా పోయింది. అయితే నాగరాజు చేష్టలు మితిమీరడంతో ఆమెకు మెలుకువ వచ్చింది. గట్టిగా కేకలు వేసేందుకు ప్రయత్నించగా నాగరాజు నోరు మూసేశాడు. దీంతో ఎలాగోలా ప్రతిఘటించి పక్కనే ఉన్న ఇంటి వారిని లేపింది బాలిక.

 
దీంతో నాగరాజు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నాగరాజు ఆకృత్యాలతో బాలికకు ఒంటిపై గాయాలు కూడా అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments