Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి కోసం గోధుమ పిండిలో విషం కలిపి 13 మందిని చంపేసింది

ఐవీఆర్
మంగళవారం, 8 అక్టోబరు 2024 (22:53 IST)
ప్రియుడు కోసం ప్రియురాలు దారుణానికి ఒడిగట్టింది. తన ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు పెద్దలు అడ్డుపడుతున్నారని తన సొంత కుటుంబ సభ్యులను పొట్టనబెట్టుకుంది. ఈ దారుణ ఘటన పాకిస్తాన్ దేశంలోని సింధు ప్రావిన్స్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
హైబత్ ఖాన్ బోహ్రి అనే గ్రామానికి చెందిన ఓ బాలిక గత కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయం తెలిసిన పెద్దలు ఆమెను తీవ్రంగా మందలించారు. దీనితో కుటుంబం పైన పగ పెంచుకోవడమే కాకుండా తన ప్రియుడికిచ్చి పెళ్లి చేయడంలేదని వారిని మట్టుబట్టేందుకు ప్లాన్ వేసింది. ప్రియుడుతో కలిసి ఆ పనిని చేసింది.
 
గోధుమ పిండిలో విషం కలిపి చపాతీలుగా చేసి వాటిని కుటుంబ సభ్యులందరికీ వడ్డించింది. వాటిని తిన్న 13 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనితో వారందరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అందరూ మరణించారు. ఈ దారుణానికి పాల్పడిన బాలికను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంతకు... హైదరాబాద్‌కు రావడానికి దారేది అనాలేమో : త్రివిక్రమ్ (Video)

"పుష్ప-2" ప్రీరిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లా?

చిత్రమైన డ్రెస్ తో సమంత - ముంబైలోనేకాదు హైదరాబాద్ కు దారేదీ అని రాలేరా? త్రివిక్రమ్ ప్రశ్న

ఓదెల 2- ఓదెల విలేజ్ లో ఫైనల్ షెడ్యూల్ లో తమన్నా భాటియా

అల్లు అర్జున్‌, డైరెక్టర్‌ సుకుమార్‌ల పుష్ప- 2 ది రూల్‌ ఫస్టాఫ్‌ లాక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎలాంటి కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిది?

ఈ 5 పాటిస్తే జీవితం ఆనందమయం, ఏంటవి?

న్యూజెర్సీలో దిగ్విజయంగా నాట్స్ క్రికెట్ టోర్నమెంట్

కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు తేనెలో ఇవి కలిపి తీసుకుంటే...

రాత్రి భోజనం ఆరోగ్యకరంగా వుండాలంటే?

తర్వాతి కథనం
Show comments