Webdunia - Bharat's app for daily news and videos

Install App

'క్రికెట్ సమరం'లో భారత్ గెలుపు!... చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‍ చిత్తు

Webdunia
ఆదివారం, 16 జూన్ 2019 (23:17 IST)
ప్రపంచ క్రికెట్ టోర్నీలో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. నిజానికి టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగా 47వ ఓవర్లో వర్షం అంతరాయం కలిగించింది. దీంతో ఆట నిలిచిపోయింది. కొద్దిసేపటికే వర్షం ఆగడంతో మ్యాచ్ కొనసాగించారు. 
 
చివరి ఓవర్లలో ధాటిగా ఆడడానికి ప్రయత్నించిన కోహ్లీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో మహ్మద్ అమీర్ 3 వికెట్లు తీశాడు. అంతకుముందు, ఓపెనర్ రోహిత్ శర్మ 140 పరుగులతో భారీ సెంచరీ నమోదు చేయగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 77 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. చివర్లో విజయ్ శంకర్ 15 బంతుల్లో 15 పరుగులు చేశాడు. 
 
అలాగే ఓపెనర్‍గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ కూడా అర్థ శతకంతో రాణించాడు. రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్‌కు 136 పరుగులు జోడించిన అనంతరం రాహుల్ అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ అండగా రోహిత్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. అయితే, మ్యాచ్ ఆఖరులో భారత ఆటగాళ్లు వేగంగా ఆడాలని భావించి వికెట్లను సమర్పించుకున్నారు. ఫలితంగా ధోనీ (1), పాండ్యా (26) చొప్పున పరుగులు చేసి ఔట్ అయ్యారు. 
 
ఆ తర్వాత భారత్ నిర్ధేశించిన 337 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేక్రమంలో ఓ దశలో నిలకడ ప్రదర్శించిన పాకిస్థాన్ ఆపై కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలంలో చిక్కుకుంది. కుల్దీప్ అద్భుతమైన బౌలింగ్‌తో ఫఖార్ జమాన్ (62), బాబర్ అజామ్ (48)లను అవుట్ చేయడంతో పాకిస్థాన్ తేరుకోలేక పోయింది. వీరిద్దరూ 9 పరుగుల తేడాతో వెనుదిరిగారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్య కీలకమైన హఫీజ్ వికెట్ తీయడంతో పాక్ నాలుగో వికెట్ కోల్పోయింది. 
 
ప్రస్తుతం పాకిస్థాన్ 34.1 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే మరో 15 ఓవర్లలో 171 పరుగులు చేయాల్సి వుండగా, చేతిలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో మరోమారు వర్షం పడటంతో మ్యాచ్‌ ఆగిపోయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యాలు తలా రెండేసి వికెట్లు చొప్పున తీశారు. వర్షం నిలిచిన తర్వాత మ్యాచ్ కొనసాగినా కూడా కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాట్స్‌మెన్లు లేకపోవడంతో పాకిస్థాన్ ఓటమి ఖాయం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వీధి కుక్క చేతిలో చిరుత పులి ఘోర పరాజయం, 300 మీటర్లు ఈడ్చుకెళ్లింది (video)

Heavy Rains Lash Chennai: చెన్నైని కుమ్మేసిన భారీ వర్షాలు.. కరెంట్ తీగను తొక్కి కార్మికురాలు మృతి

Dharmasthala Case: శానిటరీ వర్కర్ చెప్పినవన్నీ అబద్ధాలే.. అరెస్ట్ అయ్యాడు

Chandrayaan-3: చంద్రయాన్-3 మిషన్ అపూర్వమైన ఘనత.. ప్రపంచ రికార్డు

Senior citizen: వృద్ధుడిని చంపిన కేర్ టేకర్.. 8 గ్రాముల బంగారును ఎత్తుకెళ్లాడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments