రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని రివర్స్ తీసుకున్న క్రిస్ గేల్..? (video)

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (11:42 IST)
విండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. త్వరలో తాను అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు గేల్ ప్రకటించాడు. విండీస్‌లో టీమిండియాతో జరిగే టెస్టు సీరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుండి తప్పుకోనున్నట్లు గేల్ ప్రకటించాడు. కాగా ఐసీసీ వరల్డ్‌కప్ తర్వాత క్రికెట్‌కి గుడ్‌బై చెబుతానని గేల్ గతంలోనే ప్రకటించాడు. 
 
తాజాగా తాను రిటైర్మెంట్ నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు ప్రకటించాడు. మంచి ఫేర్‌వెల్ సీరీస్ లభించాలనే ఆలోచనతో ఇండియా సీరీస్ తర్వాత రిటైర్ కావాలని గేల్ భావించినట్లు సమాచారం. ఇండియాతో జరగనున్న మ్యాచ్‌కి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో తన రిటైర్‌మెంట్ గురించి ప్రస్తావించాడు.

ఇది ముగింపు కాదని, ఇంకొన్ని మ్యాచ్‌లు ఆడుతానని, ప్రపంచకప్ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అంటూ వ్యాఖ్యానించాడు. ప్రపంచకప్ తర్వాత ఇండియాతో ఒక టెస్ట్ మ్యాచ్‌ ఆడుతాను. టీ-20, వన్డేలు ఖచ్చితంగా ఆడుతానని అన్నాడు.
 
జమైకాలోని కింగ్స్‌స్టన్‌లో గేల్ పుట్టారు. 1999లో అంతర్జాతీయ జట్టులోకి అరంగేట్రం చేశాడు. టీమిండియాతో జరిగిన వన్డే మ్యాచ్‌తో క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. తన క్రికెట్ కెరీర్‌లో 103 టెస్టులు, 295 వన్డేలు, 58 టీ-20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 7,214, వన్డేల్లో 10,345, టీ-20ల్లో 1,627 పరుగులు చేశాడు. 
 
విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. వెస్టిండీస్ జట్టు ఆగస్టులో టీమిండియాతో మూడు టీ-20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. వెస్టిండీస్, అమెరికా దేశాల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ ఐటీ కారిడార్లలో మోనో రైలు.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు.. పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు.. 8 గంటలకు ప్రారంభం

ఏబీసీ క్లీన్‌టెక్, యాక్సిస్ ఎనర్జీతో రూ. 1,10,250 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

దీని గురించి మీకు తెలియదు.. దగ్గరికి రాకండి.. భార్యను నడిరోడ్డుపైనే చంపేసిన భర్త (video)

ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతాం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments