మరో రికార్డ్ నెలకొల్పిన విరాట్ కోహ్లీ.. అత్యంత వేగంగా 20వేల పరుగులు

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (18:10 IST)
ప్రపంచ క్రికెట్‌లో పరుగుల యంత్రంగా, రికార్డ్‌ల రారాజుగా వెలుగొందుతున్న విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డ్‌ను అందుకున్నాడు. విండీస్‌తో జరుగుతున్న మ్యాచ్ ద్వారా కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 20 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. భారత్ ఇన్నింగ్స్‌లో విండీస్ ఫేసర్ హోల్డర్ వేసిన 25వ ఓవర్‌లో నాలుగో బంతికి సింగిల్ తీసిన కోహ్లీ ఈ రికార్డ్‌ను అందుకున్నాడు.
 
దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 20 వేల పరుగులు పూర్తి చేసిన 12వ బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. కాగా భారతీయ బ్యాట్‌మెన్‌ల వరుసలో మూడో వ్యక్తిగా నిలవడం మరో విశేషం. భారతీయ బ్యాట్స్‌మెన్‌లలో కేవలం సచిన్ టెండుల్కర్(34,357), రాహుల్ ద్రవిడ్‌(24,208) మాత్రమే ఈ రికార్డ్‌ను సాధించారు. తాజాగా కోహ్లీ వారి సరసన చేరాడు.
 
విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 417 ఇన్నింగ్స్ ఆడాడు. టెస్టుల్లో 131‌, వన్డేల్లో 224, టీ20ల్లో 62 ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే విశేషం ఏమిటంటే కోహ్లీ అతి తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ రికార్డ్‌ను నెలకొల్పింది మాత్రం కోహ్లీనే. సచిన్, లారా 453 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకోగా, ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ 468 ఇన్నింగ్స్‌లలో ఈ రికార్డ్‌ను సాధించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్షన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments