Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియాను వదలని కరోనా రక్కసి.. ఆ ఇద్దరికి పాజిటివ్

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (19:10 IST)
Team India
శ్రీలంక పర్యటన ముగిసినా టీమిండియాను కరోనా వదలట్లేదు. మరో ఇద్దరు భారత క్రికెటర్లకు కరోనా సోకింది. రెండు రోజుల క్రితం కృనాల్ పాండ్యాకు పాజిటివ్‌గా నిర్ధారణ కాగా తాజాగా లెగ్ స్పిన్నర్ యుజ్వేందర్ చాహల్, స్పిన్ బౌలర్ కమ్ ఆల్ రౌండర్ కృష్ణప్ప గౌతమ్ కరోనా బారిన పడ్డారు.
 
ఇప్పటికే ఐసోలేషన్‌లో ఉన్న కృనాల్ పాండ్యాతో సన్నిహితంగా ఉన్న కారణంగా వీరిద్దరికీ కరోనా సోకినట్లు తెలుస్తోంది. కృనాల్ పాండ్యాతో కాంటాక్టులో ఉన్న ఎనిమిది మంది ఆటగాళ్లు ఐసోలేషన్ లో ఉన్నారు. తాజాగా వీరికి టెస్టులు నిర్వహించగా చాహల్, గౌతమ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది.
 
శ్రీలంక పర్యటన ముగిసినా ఐసోలేషన్ లో ఉన్న చాహల్, గౌతమ్, కృనాల్ పాండ్యా ఇప్పట్లో భారత్ కు తిరిగిరారు. శ్రీలంకలో హెల్త్ ప్రోటోకాల్స్ ప్రకారం కరోనా సోకినా వారు తప్పకుండా పది రోజులు ఐసోలేషన్ లో ఉండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

తర్వాతి కథనం
Show comments