టీమిండియాను వదలని కరోనా రక్కసి.. ఆ ఇద్దరికి పాజిటివ్

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (19:10 IST)
Team India
శ్రీలంక పర్యటన ముగిసినా టీమిండియాను కరోనా వదలట్లేదు. మరో ఇద్దరు భారత క్రికెటర్లకు కరోనా సోకింది. రెండు రోజుల క్రితం కృనాల్ పాండ్యాకు పాజిటివ్‌గా నిర్ధారణ కాగా తాజాగా లెగ్ స్పిన్నర్ యుజ్వేందర్ చాహల్, స్పిన్ బౌలర్ కమ్ ఆల్ రౌండర్ కృష్ణప్ప గౌతమ్ కరోనా బారిన పడ్డారు.
 
ఇప్పటికే ఐసోలేషన్‌లో ఉన్న కృనాల్ పాండ్యాతో సన్నిహితంగా ఉన్న కారణంగా వీరిద్దరికీ కరోనా సోకినట్లు తెలుస్తోంది. కృనాల్ పాండ్యాతో కాంటాక్టులో ఉన్న ఎనిమిది మంది ఆటగాళ్లు ఐసోలేషన్ లో ఉన్నారు. తాజాగా వీరికి టెస్టులు నిర్వహించగా చాహల్, గౌతమ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది.
 
శ్రీలంక పర్యటన ముగిసినా ఐసోలేషన్ లో ఉన్న చాహల్, గౌతమ్, కృనాల్ పాండ్యా ఇప్పట్లో భారత్ కు తిరిగిరారు. శ్రీలంకలో హెల్త్ ప్రోటోకాల్స్ ప్రకారం కరోనా సోకినా వారు తప్పకుండా పది రోజులు ఐసోలేషన్ లో ఉండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

ప్రధాని మోడీ కర్మయోగి - కూటమి ప్రభుత్వం 15 యేళ్లు కొనసాగాలి : పవన్ కళ్యాణ్

PM tour in AP: ప్రధాని ఏపీ పర్యటనలో అపశృతి.. కరెంట్ షాకుతో ఒకరు మృతి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

తర్వాతి కథనం
Show comments