Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డేంజర్ మార్క్‌ దాటిన యమునా నది : వరద ముప్పు ముంగిట ఢిల్లీ

డేంజర్ మార్క్‌ దాటిన యమునా నది : వరద ముప్పు ముంగిట ఢిల్లీ
, శుక్రవారం, 30 జులై 2021 (18:48 IST)
యమునా నది ఉగ్రరూపం దాల్చింది. ఢిల్లీతో పాటు.. దాని ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు హతినికుండ్ ప్రాజెక్టు నుంచి వరద నీటికి ఒక్కసారిగా భారీగా విడుదల చేశారు. దీంతో యమునా నది ప్రమాద హెచ్చరికలను దాటి ప్రవహిస్తుంది. ఈ కారణంగా దేశ రాజధాని ఢిల్లీ పరిసరాలకు వరద ముప్పు పొంచి ఉంది. 
 
ప్రస్తుతం ఢిల్లీ వద్ద యమున నది నీటి మట్టం 205.33 మీటర్లు దాటింది. దాంతో ఢిల్లీ అధికార యంత్రాంగం వరద హెచ్చరిక జారీ చేసింది. యుమున నదీ పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
 
యమున నది నీటిమట్టం అంతకంతకు పెరుగుతుండడంతో అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యలకు బోట్లను అధికారులు అందుబాటులో ఉంచారు. అలాగే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈటలకు స్వల్ప అస్వస్థత - 'ప్రజా దీవెన యాత్రకు బ్రేక్'