సౌతాంప్టన్ వేదికగా ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్లు ఏజీస్ బౌల్ వేదికగా తలపడుతున్నాయి. వర్షం కారణంగా టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట పూర్తిగా రద్దు అయిన విషయం తెల్సిందే. శనివారం వర్షం పడకపోవడంతో మ్యాచ్ నిర్వహించేందుకు మైదానాన్ని సిద్ధం చేశారు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.