Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ కెప్టెన్సీపై గంగూలీ ఏమన్నాడు..? ఐసీసీ టోర్నీలపై దృష్టి పెట్టాలట..

Webdunia
బుధవారం, 16 అక్టోబరు 2019 (18:28 IST)
బీసీసీఐ అధ్యక్షుడిగా దిగ్గజ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియామయం ఖాయమైంది. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి కెప్టెన్సీలో మన జట్టు మంచి ప్రదర్శనలు చేస్తోందని కొనియాడాడు. అయితే, కీలకమైన ఐసీసీ టోర్నీలో మాత్రం ఓటమి చవిచూశారని.. దీనిని అధిగమించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వుంటుందని చెప్పాడు. 
 
ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్‌తో సరిపెట్టుకోవడంపై కూడా గంగూలీ కామెంట్లు చేశాడు. ఆటగాళ్లంతా అద్భుత ప్రదర్శన చేస్తున్నప్పటికీ సెమీఫైనల్‌, ఫైనల్స్‌లో రాణించలేకపోతున్నారు. ఇకపై ఆ సీన్ మారాలి. విరాట్ సారథ్యంలో మన జట్టు మెరుగైన విజయాలతో రాణించాలని సూచించాడు.
 
2013లో ధోని సారధ్యంలో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫి గెలిచిన టీమిండియా ఆ తర్వాత ఐసీసీ టోర్నీలో విజేతగా నిలవలేదు. కానీ కోహ్లీ సారధ్యంలో టీమిండియా ఇంటాబయటా మెరుగైన ఆటతో దూసుకెళ్తోంది. అయినా ఐసీసీ టోర్నీలపై దృష్టి పెట్టాల్సిన అవసరం వుందని గంగూలీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments