Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ-20 ఆసియా కప్- దాయాది పాక్‌కు భారత మహిళా జట్టు చుక్కలు..

ట్వంటీ-20 ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో దాయాది దేశమైన పాకిస్థాన్‌ను భారత మహిళా జట్టు చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పా

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (15:43 IST)
ట్వంటీ-20 ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో దాయాది దేశమైన పాకిస్థాన్‌ను భారత మహిళా జట్టు చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టు కేవలం 72 పరుగులు మాత్రమే సాధించగలిగింది. 
 
ఈ స్వల్ప 73 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన భారత అమ్మాయిలు కేవలం 16.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను అధిగమించారు. తద్వారా ఏడు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించిన భారత జట్టు ఫైనల్ పోరుకు సిద్ధమైంది. 
 
భారత మహిళా జట్టులో మొదటి ఓవర్‌లోనే మిథాలీరాజ్ ఔట్ అయ్యింది. దీంతో భారత జట్టులో టెన్షన్ మొదలైంది. అయితే తర్వాత బ్యాటింగ్‌కు దిగిన స్పృతి మంధాన నిలకడగా ఆడింది. 38 పరుగులు చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ 34 రన్స్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు.
 
అంతకుముందు పాకిస్థాన్ బ్యాట్స్‌ఉమెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఇండియన్ ఉమెన్స్ బౌలింగ్ ధాటికి విలవిల్లాడిపోయింది. ఫలితంగా నహఇద, సనామిర్ మాత్రమే 18, 20 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. మిగతా వాళ్లు అందరూ 7, 8, 9 పరుగులు మాత్రమే చేశారు. భారత బౌలర్లలో బిస్త్ మూడు వికెట్లు తీసి పాక్‌ను చావుదెబ్బ కొట్టింది. ఫలితంగా భారత్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

తర్వాతి కథనం
Show comments