Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెరీర్‌పై వచ్చే యేడాది కీలక నిర్ణయం తీసుకుంటా : యువరాజ్ సింగ్

భారత డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన క్రికెట్ కెరీర్‌పై వచ్చే యేడాది కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రకటించారు. అదేసమయంలో అప్పటివరకు క్రికెట్ ఆడుతానని తెలిపారు.

Webdunia
సోమవారం, 23 ఏప్రియల్ 2018 (13:08 IST)
భారత డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన క్రికెట్ కెరీర్‌పై వచ్చే యేడాది కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రకటించారు. అదేసమయంలో అప్పటివరకు క్రికెట్ ఆడుతానని తెలిపారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 2019 ప్రపంచకప్ వరకూ తాను భారత జట్టు తరపున ఆడాలనుకుంటున్నట్టు చెప్పారు. 2019 చివర్లోనే తన అంతర్జాతీయ కెరీర్‌పై నిర్ణయం తీసుకుంటానని తెలిపాడు. యువరాజ్ సింగ్ చివరిగా 2017లో భారత జట్టు తరపున వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. రెండు దశాబ్దాలుగా దేశం కోసం ఆడుతున్న తాను ఏదో ఒక రోజు విరామం తీసుకుంటానని తెలిపారు. 
 
"2000 సంవత్సరం నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నా. ఎవరైనా సరే ఏదో ఒక రోజు రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే. 2019 తర్వాత నేను కూడా కచ్చితంగా నిర్ణయం తీసుకుంటా" అని చెప్పాడు. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ లీగ్‌లో యువరాజ్ సింగ్ కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు తరపున ఆడుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

తర్వాతి కథనం
Show comments