Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిషబ్ పంత్ అదరగొట్టేశాడు.. కష్టాలు ఎవరికి?

Webdunia
సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (10:49 IST)
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ అద్భుతంగా ఆడటంతో.. అతడు తొలి టెస్టు మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సాహాకు కష్టాలు తప్పవని సమాచారం. న్యూజిలాండ్ లెవన్ జట్టుతో ఈ నెల 14వ తేదీన ఆరంభమైన మూడు రోజుల క్రికెట్ టెస్టు మ్యాచ్, తొలి ఇన్నింగ్స్‌లో ఆడిన భారత జట్టు 263 పరుగులు సాధించింది. 
 
వికారి 101 పరుగులు, పుజారా 93 పరుగులు సాధించారు. తదనంతరం బరిలోకి దిగిన కివీస్ లెవన్ జట్టు 135 పరుగులకు ఆలౌటైంది. అటుపిమ్మట రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 252 పరుగులు సాధించింది. ఇందులో రిషబ్ పంత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 70 పరుగులు సాధించాడు. ఇందులో 4 సిక్సర్లు వున్నాయి. 
 
టీమిండియా ఇటీవల ఆడిన మ్యాచ్‌ల్లో రిషబ్ పంత్ మెరుగ్గా రాణించలేకపోయాడు. అయితే ప్రస్తుత మ్యాచ్‌లో నిలకడగా ఆడిన కారణంగా ఈ నెల 21వ తేదీ నుంచి కివీస్‌తో ప్రారంభమయ్యే తొలి టెస్టు మ్యాచ్‌లో రిషబ్ పంత్ ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం వికెట్ కీపర్‌గా వున్న సాహెల్‌కు కష్టాలు తప్పవని.. అతనిని తొలగించి అతని స్థానంలో రిషబ్ పంత్‌ను తీసుకునే ఛాన్సుందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్ కోసం భూసేకరణ- కేంద్రం నిధుల విడుదలలో జాప్యం

Pulivendula ZPTC Bypoll: పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక

జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూత

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఏపీలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouni Roy: విశ్వంభరలో పాట కోసం రూ.45 లక్షలు తీసుకున్న మౌని రాయ్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

తర్వాతి కథనం
Show comments