Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహీకి కోపమొచ్చింది.. నేనేమైన పిచ్చోడిలా కనిపిస్తున్నానా?

మిస్టర్ కూల్‌గా పేరొందిన జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీకి కోపమొచ్చింది. అంతే ఊగిపోతూ '300 మ్యాచ్‌లు ఆడా, పిచ్చోడినా' అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడట. ఇంతకీ ఈ వార్నింగ్ ఎవరికిచ్చాడో తెలుసా.. జట్టు సహ

Webdunia
బుధవారం, 11 జులై 2018 (20:58 IST)
మిస్టర్ కూల్‌గా పేరొందిన జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీకి కోపమొచ్చింది. అంతే ఊగిపోతూ '300 మ్యాచ్‌లు ఆడా, పిచ్చోడినా'  అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడట. ఇంతకీ ఈ వార్నింగ్ ఎవరికిచ్చాడో తెలుసా.. జట్టు సహచర సభ్యుడు కుల్దీప్ యాదవ్‌కే. ఈ విషయం ఎలా పొక్కిందన్నదే కదా మీ సందేహం. అలాంటి స్వీట్ వార్నింగ్ తీసుకున్న బౌలరే వెల్లడించారు.
 
తాజాగా ఇండోర్‌‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కుల్దీప్ యాదవ్ గుర్తుచేశారు. 'శ్రీలంకతో జరిగిన టీ-20 మ్యాచ్‎లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. టార్గెట్ ఛేదించడానికి శ్రీలంక కూడా జోరుగా ఆడుతోంది. ఆ సమయంలో నేను బౌలింగ్ చేస్తున్నా. నేను వేసిన ప్రతీబంతిని బ్యాట్స్‌మెన్ బౌండరీకి పంపుతున్నారు. అప్పుడు ధోనీ నన్ను పిలిచాడు. ఫీల్డ్ మార్చుకొని బౌలింగ్ చేయి అన్నారు. నాకు తెలుసు.. నువ్వు కూల్‌గా ఉండు ధోనీ అన్నా. దీంతో ఆయన నాపై మండిపడ్డారు. 300 మ్యాచ్‌లు ఆడాను. నేనేమన్నా పిచ్చోడినా. నేను చెప్పినట్టు చేయ్ అంటూ కోపగించుకున్నారు. ఆ తర్వాత ధోనీ చెప్పినట్టే బౌలింగ్ వేశా. ఆ ఓవర్‌లో వికెట్ పడింది. దీంతో ధోనీ నా దగ్గరకి వచ్చి నేను చెప్పింది ఇదే కదా అన్నారు' అని కుల్దీప్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments