Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమర్శకుల నోళ్లు మూయించిన పాకిస్థాన్ జట్టు.. సెమీస్ ఆశలు సజీవం!!

Webdunia
బుధవారం, 1 నవంబరు 2023 (11:38 IST)
భారత్‌లో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ మెగా టోర్నీలో భాగంగా మంగళవారం పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో పాకిస్థాన్ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. తద్వారా తమను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నవారి నోళ్లను మూయించింది. ఆ జట్టు ఇప్పటివరకు మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడి మూడు విజయాలు సాధించింది. 
 
దీంతో ఆ జట్టు ఖాతాలో ఆరు పాయింట్లు చేరాయి. అయితే, బంగ్లాదేశ్‌పై గెలిచిన తర్వాత పాక్ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. మూడు, నాలుగు స్థానాల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాకంటే రెండు పాయింట్లు వెనుకబడివుంది. పాక్ జట్టు ఇంకా మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సివుంది. అదేసమయంలో ఇతర జట్ల గెలుపోటముల కోసం పాక్ జట్టు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. 
 
ముఖ్యంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు ఓటమి పాలైతే పాక్ అవకాశాలు మెరుగవుతాయి. లేదంటే సెమీఫైనలు అర్హత సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాలి. ఇదిలావుంటే, పాకిస్థాన్‌ జట్టు చేతిలో బంగ్లాదేశ్ ఓడిపోవడంతో ఆ జట్టు సెమీఫైనల్ ఆశలు ముగిసిపోయాయి. బంగ్లాదేశ్ ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడగా కేవలం ఒక్కటంటే ఒక్క విజయం మాత్రమే సాధించింది. 
 
రెండు పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆ జట్టు 9వ స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా టాప్-4లోకి ప్రవేశించే అవకాశమే లేదు. కాబట్టి షకీబ్ అల్ హసన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. కాగా ఇప్పటివరకు ఏ జట్టూ సెమీఫైనల్ స్థానాన్ని ఖరారు చేసుకోకపోవడం గమనార్హం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి మెంటల్ ఆస్పత్రికి తరలింపు (Video)

ఆ వెస్టిండీస్ క్రికెటర్ అలాంటివాడా? 11 మంది మహిళలపై అత్యాచారం?

కోల్‌కతాలో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ - సెక్యూరిటీ గార్డు అరెస్టు

పూరీ జగన్నాథ రథ యాత్రలో 600 మందికి అస్వస్థత

మాజీ మంత్రి కాకాణికి బెయిల్.. మరో రెండు కేసుల్లో రిమాండ్ - కస్టడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

తర్వాతి కథనం
Show comments