Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ : ముంబై నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైలు

Webdunia
శనివారం, 18 నవంబరు 2023 (11:38 IST)
ఈ నెల 19వ తేదీ ఆదివారం అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం భారతీయ రైల్వే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైలును నడిపేలా చర్యలు చేపట్టింది. ఈ అంతిమ పోరును ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్షలాది మంది అహ్మదాబాద్‌కు చేరుకునే అవకాం ఉండటంతో వారి కోసం ఈ ప్రత్యేక రైలును నడుపనున్నట్టు సెంట్రల్ రైల్వే జోన్ ప్రకటించింది. 
 
ఈ రైలు శనివారం అర్థరాత్రి గం.1.45కు ముంబైలో బయలుదేరి ఉదయం గం.10.35కు అహ్మదాబాద్ నగరానికి చేరుకుంటుందని రైల్వేశాఖ తెలిపింది. అలాగే అభిమానుల సౌకర్యార్థం అహ్మదాబాద్‌ నగరంలోని మొతేరా స్టేషన్ వైపు వెళ్లే మెట్రో రైళ్ల సంఖ్యను కూడా పెంచనున్నారు. 
 
భారత్ - ఆస్ట్రేలియా టీ20 టోర్నీ... హాట్ కేకుల్లా వైజాగ్ మ్యాచ్ టిక్కెట్లు  
 
ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ - ఆస్ట్రేలియా జట్లు తలపడతున్నాయి. ఈ నెల 19వ తేదీ ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుంది. ఈ ఫైనల్ పోరు తర్వాత ఈ నెల 23వ తేదీ నుంచి భారత్ - ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ వైజాగ్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్ టిక్కెట్ల విక్రయం శుక్రవారం నుంచి మొదలుపెట్టగా, ఇవి హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. 
 
ఈ టిక్కెట్ల విక్రయాన్ని ఇందిరాప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం, పీఎంపాలెం క్రికెట్‌ స్టేడియం, గాజువాకలో రాజీవ్‌గాంధీ స్టేడియంల వద్ద మహిళలకు, పురుషులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేశారు. ఉదయం నుంచే ఆయా కేంద్రాల వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. తొలిరోజు 5 వేల టికెట్లను అందుబాటులో ఉంచగా, రూ.600 టికెట్లు గంట వ్యవధిలోనే అయిపోయాయి. క్యూలైన్‌లో గంటల తరబడి నిల్చున్నా టికెట్లు దొరక్కపోవడంతో పలువురు అభిమానులు నిరాశ చెందారు. 
 
మురికివాడల నుంచి వచ్చిన పలువురు మహిళలు గురువారం అర్థరాత్రి నుంచే క్యూలైనులో కాపు కాశారు. వీరి ద్వారా బ్లాక్‌లో ఆయా టికెట్లను విక్రయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏసీఏ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపీనాథరెడ్డి కౌంటర్లను పరిశీలించారు. రూ.600, రూ.1500, రూ.2 వేలు, రూ.3 వేలు, రూ.3,500, రూ.6 వేల విలువ కలిగిన టికెట్లు రోజుకు 5 వేల చొప్పు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. శనివారం కూడా ఆయా కేంద్రాల వద్ద టికెట్ల విక్రయాలు జరుగుతాయన్నారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వారు ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియం, గాజువాక రాజీవ్‌గాంధీ ఇండోర్‌ స్టేడియంల వద్ద ఈ నెల 22 లోగా, పీఎంపాలెం క్రికెట్‌ స్టేడియం వద్ద 23వ తేదీ వరకు రెడీమ్‌ చేసుకోవచ్చని తెలిపారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ర్యాంకులు మంత్రులను తక్కువ చేసేందుకు కాదు : సీఎం చంద్రబాబు

విశాఖపట్నం అన్న క్యాంటీన్‌లో సినీ సెలెబ్రెటీలు.. వారెవరంటే?

సెలవు ఇవ్వలేదని సహోద్యోగులను కత్తితో పొడిచిన ఉద్యోగి... ఎక్కడ?

Ram Gopal Varma: విచారణకు రామ్ గోపాల్ వర్మ.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎందుకు కలిశారు?

మహా కుంభమేళాలో మళ్లీ అగ్నిప్రమాదం.. అసలు కారణం ఏంటి? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరెస్టు వారెంట్ కాదు.. సాక్షిగా సమన్లు జారీ చేసింది : సోనూసూద్

మీ ముఖ దర్శనం అవుతుంది సామీ... థ్యాంక్యూ మై బుజ్జి తల్లి... శోభిత పోస్టుపై చై స్పందన

పాకిస్తాన్ బోర్డర్‌లో తండేల్, నాగచైతన్య, సాయిపల్లవి నటన ఎలా వుంది? రివ్యూ

Thandel: తండేల్ ట్విట్టర్ రివ్యూ.. నాగ చైతన్య, సాయి పల్లవి నటనకు మంచి మార్కులు

Pushpa 2: పుష్ప ఫ్యాన్.. మహా కుంభమేళాలో డైలాగులతో ఇరగదీశాడు.. వీడియో వైరల్

తర్వాతి కథనం