Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెట్ జట్టుకు ఇద్దరి సేవలు అక్కర్లేదు : గంగూలీ

Webdunia
ఆదివారం, 29 సెప్టెంబరు 2019 (12:48 IST)
భారత మాజీ క్రికెటర్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టు మరింత పటిష్టంగా ఉండాలంటే ఇద్దరు క్రికెటర్లను జట్టు నుంచి తొలగించాలని కోరారు. ముఖ్యంగా, మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌, యజ్వేంద్ర చహల్‌లను తిరిగి ఎంపిక చేయాలని సూచన చేశారు. 
 
ఇదే అంశంపై సౌరవ్ స్పందిస్తూ, ప్రస్తుతం యువ క్రికెటర్లను పరీక్షించాలనే ఉద్దేశంతో చహల్‌ను పక్కకు పెట్టినప్పటికీ, టీ20 ఫార్మాట్‌లో అతని అవసరం చాలా ఉందన్నాడు. వచ్చే ఏడాది వరల్డ్‌ టీ20 జరుగనున్న నేపథ్యంలో కుల్దీప్‌ యాదవ్‌, చహల్‌లు ఎంతో ముఖ్యమన్నాడు. వీరిద్దరూ జట్టులో ఉంటే భారత జట్టు మరింత బలోపేతం అవుతుందని చెప్పాడు. 
 
కాగా, వరల్డ్‌ టీ20 ఫలితం ఎలా ఉండబోతుందనే దానిపై మాత్రం గంగూలీ సమాధానం చెప్పలేదు. కాకపోతే ఆ మెగా టోర్నీలో విరాట్‌ కోహ్లి కీలక పాత్ర పోషిస్తాడని ఆశిస్తున్నానన్నాడు. ఆ వరల్డ్‌కప్‌ కోహ్లీ చాలా ముఖ్యమైనదన్నాడు. 
 
అదేసమయంలో భారత జట్టు ఇద్దరు లెఫ్టార్మ్‌ స్పిన్నర్లు అయిన రవీంద్ర జడేజా, కృనాల్‌ పాండ్యాలు అవసరం లేదన్నాడు. వీరిలో ఎవరో ఒకరు ఉంటే సరిపోతుందన్నాడు. ఆ ఇద్దర్నీ ఒకే మ్యాచ్‌ తుది జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని గుర్తించాలని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుంకాలను సున్నా శాతానికి తగ్గించేందుకు భారత్ ఆఫర్ చేసింది : డోనాల్డ్ ట్రంప్

India: వైజాగ్‌లో దేశంలోనే అతిపెద్ద గాజు వంతెన.. స్కైవాక్ టైటానిక్ వ్యూ పాయింట్‌

Pawan Kalyan పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, అల్లు అర్జున్

పవన్ కళ్యాణ్... ఓ పీపుల్స్ స్టార్ : నారా లోకేశ్

ప్రజల దీవెనలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి : పవన్‌కు సీఎం బాబు విషెస్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

చిత్రపరిశ్రమలో విపరీతమైన లింగ వివక్ష : నటి కృతి సనన్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

తర్వాతి కథనం
Show comments