Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరుష్క బంధానికి ముచ్చటగా మూడేళ్లు!

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (13:54 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ గత 2017 డిసెంబరు నెల 11వ తేదీన ఓ ఇంటివారయ్యారు. ఇటలీలో వీరి వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరిగింది. అపుడు ఈ పెళ్లి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిది. ఈ క్రమంలో వీరు - అనుష్క పెళ్లి బంధానికి నేటితో మూడేళ్లు ముగియనున్నాయి. ఈ జంట ఇపుడు మూడో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 
 
ఈ సందర్భంగా ఈ సెలబ్రిటీ కపుల్‌కి సోషల్‌ మీడియాలో అభినందనల వెల్లువకురుస్తోంది. ముఖ్యంగా త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందబోతున్న తరుణంలో ఈ ఏడాది మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. అటు క్రికెట్‌ అభిమానులు, ఇటు బాలీవుడ్‌ ఫ్యాన్స్‌ విరుష్క  జంటకు  శుభాకాంక్షలతో సందడి చేస్తున్నారు. దీంతో ట్విట​ర్‌లో ట్రెండింగ్‌గా విరుష్కాల పెళ్లిరోజు మారడం విశేషం.
 
కాగా, ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే, వన్డే, ట్వంటీ20 సిరీస్‌లను పూర్తి చేసుకున్న కోహ్లీ సేన త్వరలో టెస్ట్ సిరీస్‌ను ప్రారంభించనుంది. అయితే, తొలి టెస్ట్ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ స్వదేశానికి రానున్నాడు. తన భార్య కాన్పు సమయంలో దగ్గరే ఉండాలని నిర్ణయించుకున్న కోహ్లీ బీసీసీఐ అనుమతితో స్వదేశానికి తిరిగిరానున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బరువు తగ్గేందుకు ఫ్రూట జ్యూస్ డైట్.. చివరకు...

నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కారును ప్రహరీ గోడపైకి ఎక్కించిన డ్రైవర్

Hyderabad: భార్యాభర్తల గొడవలు నాలుగు గోడలకే పరిమితం కాదు.. హత్యల వరకు వెళ్తున్నాయ్!

ప్రధాని మోడీ మూడేళ్ళలో విదేశీ పర్యటన ఖర్చు రూ.295 కోట్లు

రాజ్యసభలో అడుగుపెట్టిన కమల్ హాసన్... తమిళంలో ప్రమాణం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

తర్వాతి కథనం
Show comments