Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క శర్మ వల్లే రాణించగలిగాను... ఎక్కువ క్రెడిట్ ఆమెకే: విరాట్ కోహ్లీ

దక్షిణాఫ్రికా గడ్డపై తాను రాణించేందుకు తన భార్య అనుష్క శర్మనే కారణమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ మొత్తం మూడు సెంచరీలు, ఒక అర్థ సెంచరీతో అదరగొట్టాడు. మొ

Webdunia
శనివారం, 17 ఫిబ్రవరి 2018 (10:04 IST)
దక్షిణాఫ్రికా గడ్డపై తాను రాణించేందుకు తన భార్య అనుష్క శర్మనే కారణమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ మొత్తం మూడు సెంచరీలు, ఒక అర్థ సెంచరీతో అదరగొట్టాడు. మొత్తం 558 పరుగులతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ను అందుకున్న కోహ్లీ.. శనివారం ముగిసిన మ్యాచ్‌కు అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన సతీమణి వల్లే ఈ స్థాయికి రాణించగలిగానని అనుష్క శర్మను ఆకాశానికెత్తేశాడు. 
 
ఈ విజయంలో ఎక్కువ క్రెడిట్ అనుష్కకే చెల్లుతుందని చెప్పారు. వ్యక్తిగత ప్రదర్శనతో కెప్టెన్‌గా విజయాలు అందుకోవడం గొప్ప అనుభూతి అని.. జట్టు విజయాల కోసం తన వంతుగా 120 శాతం కృషి చేస్తానని కోహ్లీ చెప్పారు. ఇప్పటికే సిరీస్ అయిపోలేదని ట్వంటీ-20 సిరీస్‌ను కూడా వదులుకునే ప్రసక్తే లేదని కోహ్లీ వ్యాఖ్యానించాడు.
 
ఇకపోతే.. దక్షిణాఫ్రికాతో మూడు ట్వంటీ-20ల సిరీస్ ఆదివారం జోహెన్స్‌బర్గ్ వేదికగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇక శనివారం నాటి ఆరో వన్డేలో 129 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ, ఈ సిరీస్‌లో మూడో సెంచరీ చేసి జట్టుకు భారీ విజయం  అందించడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ను సైతం కోహ్లీ సొంతం చేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

తర్వాతి కథనం
Show comments