Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐకు కాసుల వర్షం. ప్రసార హక్కుల కోసం రూ.6 వేల కోట్లు

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (10:46 IST)
క్రికెట్ ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన బోర్డుగా ఉన్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కు కాసుల వర్షం కురుస్తుంది. 2023-28 సీజన్లకు గాను మీడియా హక్కులను వయాకామ్-19 చేజిక్కించుకుంది. ఇందుకోసం బీసీసీఐకు దాదాపుగా రూ.6 వేల కోట్ల ఆదాయం రానుంది. ఈ ప్రసార హక్కుల కింద భారత క్రికెట్ జట్టు స్వదేశంలో ఆడే అన్ని మ్యాచ్‌లను వయాకామ్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ ప్రసార హక్కులను చేజిక్కించుకునేందుకు ఈ-వేలం నిర్వహించగా, వీటికి సోనీ పిక్చర్స్, డిస్నీస్టార్ నుంచి తీవ్రమైన పోటీ ఎదురైనప్పటికీ వయాకామ్-19 దక్కించుకుంది. వయాకామ్ 18 సంస్థ రిలయన్స్‌కు చెందిన కంపెనీ కావడం గమనార్హం. 
 
ఈ పోటీలో విజేతగా నిలిచేందుకు వయాకామ్ 18 సంస్థ బీసీసీఐకి కళ్లు చెదిరే రీతిలో రూ.5,963 కోట్లు చెల్లించనుంది. ఈ ఒప్పందం ప్రకారం భారత జట్టు స్వదేశంలో ఆడే మ్యాచ్‌లను వయాకామ్ తన స్పోర్ట్స్-18 చానల్లో ఐదేళ్ల పాటు ప్రసారం చేయనుంది. ఈ ఏడాది నుంచి 2028 వరకు అన్ని సీజన్లలో మ్యాచ్‌లను వయాకామ్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. మీడియా హక్కుల కోసం నిర్వహించిన ఈ-వేలంలో వయాకామ్ 18 సంస్థకు డిస్నీ స్టార్, సోనీ పిక్చర్స్ నుంచి తీవ్రమైన పోటీ ఎదురైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ మంతి కాకాణికి బెయిల్.. మరో రెండు కేసుల్లో రిమాండ్ - కస్టడీ

ప్రముఖ న్యూస్ చానెల్ యాంకర్ ఆత్మహత్య

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

తర్వాతి కథనం
Show comments