Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐకు కాసుల వర్షం. ప్రసార హక్కుల కోసం రూ.6 వేల కోట్లు

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (10:46 IST)
క్రికెట్ ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన బోర్డుగా ఉన్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కు కాసుల వర్షం కురుస్తుంది. 2023-28 సీజన్లకు గాను మీడియా హక్కులను వయాకామ్-19 చేజిక్కించుకుంది. ఇందుకోసం బీసీసీఐకు దాదాపుగా రూ.6 వేల కోట్ల ఆదాయం రానుంది. ఈ ప్రసార హక్కుల కింద భారత క్రికెట్ జట్టు స్వదేశంలో ఆడే అన్ని మ్యాచ్‌లను వయాకామ్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ ప్రసార హక్కులను చేజిక్కించుకునేందుకు ఈ-వేలం నిర్వహించగా, వీటికి సోనీ పిక్చర్స్, డిస్నీస్టార్ నుంచి తీవ్రమైన పోటీ ఎదురైనప్పటికీ వయాకామ్-19 దక్కించుకుంది. వయాకామ్ 18 సంస్థ రిలయన్స్‌కు చెందిన కంపెనీ కావడం గమనార్హం. 
 
ఈ పోటీలో విజేతగా నిలిచేందుకు వయాకామ్ 18 సంస్థ బీసీసీఐకి కళ్లు చెదిరే రీతిలో రూ.5,963 కోట్లు చెల్లించనుంది. ఈ ఒప్పందం ప్రకారం భారత జట్టు స్వదేశంలో ఆడే మ్యాచ్‌లను వయాకామ్ తన స్పోర్ట్స్-18 చానల్లో ఐదేళ్ల పాటు ప్రసారం చేయనుంది. ఈ ఏడాది నుంచి 2028 వరకు అన్ని సీజన్లలో మ్యాచ్‌లను వయాకామ్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. మీడియా హక్కుల కోసం నిర్వహించిన ఈ-వేలంలో వయాకామ్ 18 సంస్థకు డిస్నీ స్టార్, సోనీ పిక్చర్స్ నుంచి తీవ్రమైన పోటీ ఎదురైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యను, కొడుకును తుపాకీతో కాల్చి చంపి టెక్కీ ఆత్మహత్య... ఎక్కడ?

Sailajanath: వైకాపా సింగనమల అసెంబ్లీ సమన్వయకర్తగా సాకే శైలజానాథ్

అప్పన్న స్వామి ఆలయంలో అపశ్రుతి.. గోడకూలి ఎనిమిది మంది భక్తులు మృతి (video)

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

తర్వాతి కథనం
Show comments