Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ : ఎవరికీ అందనంత ఎత్తులో కోహ్లీ సేన

Webdunia
ఆదివారం, 6 అక్టోబరు 2019 (17:11 IST)
టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహిస్తోంది. ఇందుకోసం అన్ని క్రికెట్ జట్లు ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు అద్వితీయంగా రాణిస్తోంది. 
 
విశాఖపట్టణం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అన్ని రంగాల్లోనూ రాణించి సఫారీలను 203 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ ద్వారా భారత జట్టు ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది.
 
ఇటీవలే ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ షురూ అయింది. ఇక మీదట ఆయా దేశాలు ఆడే టెస్టు మ్యాచ్‌లు వరల్డ్ చాంపియన్ షిప్‌లో భాగంగానే నిర్వహిస్తారు. 
 
ఈ క్రమంలో చాంపియన్ షిప్ మొదలయ్యాక భారత్ ఆడిన 3 టెస్టుల్లోనూ ఘనవిజయం సాధించింది. ఇటీవలే విండీస్ గడ్డపై రెండు టెస్టుల్లోనూ జయభేరి మోగించిన భారత్, ఇప్పుడు సొంతగడ్డపైనా అదే ఒరవడి కొనసాగించింది. తద్వారా ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో 160 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
 
ఆ తర్వాత స్థానంలో న్యూజిలాండ్‌ ఉంది. అయితే, భారత్‌కు కివీస్ జట్లకు మధ్య దాదాపు వంద పాయింట్ల మేరకు వ్యత్యాసం ఉంది. కివీస్ ఖాతాలో 60 పాయింట్లే ఉన్నాయి. అలాగే, శ్రీలంక కూడా 60 పాయింట్లు సాధించింది. బలమైన టెస్టు జట్లుగా పేరుగాంచిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఈ జాబితాలో 4, 5 స్థానాల్లో ఉన్నాయి. 
 
ఇటీవలే యాషెస్ లో భాగంగా 5 టెస్టులాడిన ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించగా, ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక, టెస్టు వరల్డ్ చాంపియన్ షిప్ మొదలయ్యాక పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఇప్పటివరకు మ్యాచ్‌లు ఆడని కారణంగా పాయింట్ల పట్టికలో చిట్ట చివరన నిలిసాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments